Begin typing your search above and press return to search.

'గుంటూరు కారం' ఈవెంట్.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి గురు

హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేయగా లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు అనుమతి లభించలేదట.

By:  Tupaki Desk   |   5 Jan 2024 1:10 PM GMT
గుంటూరు కారం ఈవెంట్.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి గురు
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం' జనవరి 12 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ టైం దగ్గర పడుతున్న తరుణంలో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ డీటెయిల్స్ ని ఇటీవలే అధికారికంగా వెల్లడించింది.

జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందని, ఈ ఈవెంట్ లోనే థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేయగా లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు అనుమతి లభించలేదట. దాంతో మూవీ టీం ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు.

అనుమతి వస్తే రేపే ప్రీ రీలీజ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. లేకపోతే ఒకరోజు వాయిదా వేసి కాస్త ఆలస్యంగా ఈవెంట్ ని నిర్వహించాలని చూశారు. అందుకోసం మూవీ టీమ్ ఇప్పటికే ఓ కొత్త వేదికను సెట్ చేసింది. కానీ అనుమతి రాలేదు. దీంతో కొత్త ప్లాన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. నెక్స్ట్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ కి అనుమతి రాకపోతే ఖైతలాపూర్ కూకట్ పల్లి గ్రౌండ్స్ ని కూడా ఆప్షనల్ గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది

మరోవైపు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓవర్సీస్ ఫ్యాన్స్ కోసం అమెరికాలో లైవ్‌ పెట్టబోతున్నారట. ఇందుకోసం అక్కడ లైవ్‌ స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇప్పటివరకు ఓ తెలుగు సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓవర్సీస్ లో లైవ్ పెట్టించడం జరగలేదు. ఈ అరుదైన తనత మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాకి దక్కడం విశేషం.

ఓవర్సీస్ లో మహేష్ కి భారీగా క్రేజ్ ఉండటంతోనే మేకర్స్ ఈ సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.