Begin typing your search above and press return to search.

కీడా కోలా అభిమానులకి గుడ్ న్యూస్…

తెలంగాణలో అన్ని మల్టీప్లెక్స్ లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కేవలం 112 రూపాయిలకె కీడాకోలా చూడవచ్చని ప్రకటించింది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 4:26 AM GMT
కీడా కోలా అభిమానులకి గుడ్ న్యూస్…
X

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ కీడా కోలా. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లు రాబడుతోంది. తెలంగాణలో అయితే ఇంకా భాగా ఆడియన్స్ కి రీచ్ అవుతోంది. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా చేసిన మూడో సినిమా ఇదే కావడం విశేషం. క్రైమ్ కామెడీ జోనర్ లో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్ తో ఈ మూవీని తరుణ్ భాస్కర్ తెరకెక్కించారు.

మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి అయితే ఈ మూవీ భాగా కనెక్ట్ అయ్యింది. తరుణ్ భాస్కర్ అంటేనే ఆడియన్స్ కొత్తదనం ఎక్స్ పెక్ట్ చేస్తారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత ఐదేళ్ళు గ్యాప్ తీసుకొని కీడా కోలా చేశారు. తన ఎఫర్ట్ కి తగ్గ రిజల్ట్ అయితే వచ్చింది. ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్స్ ని తరుణ్ తన ఖాతాలో వేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో బంపర్ ఆఫర్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలంగాణలో అన్ని మల్టీప్లెక్స్ లో ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కేవలం 112 రూపాయిలకె కీడాకోలా చూడవచ్చని ప్రకటించింది. ఈ ఆఫర్ ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చిత్ర యూనిట్ ప్రెస్ రిలీజ్ చేసింది. అలాగే సినిమాలో కామెడీ రోల్ చేసిన విష్ణు తో ఒక వీడియో కూడా చేశారు.

మూవీ భాగా వచ్చింది. ఇంగ్లీష్ లో చెప్పాలి కదా అంటూ టికెట్ రెట్లు తక్కువగా ఉన్నాయి. థియేటర్స్ కి వెళ్లి మూవీని ఎజోయ్ చేయండి. బుక్ మై షోలో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆన్ లైన్ లో బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది.

మరి మల్టీ ప్లెక్స్ లో తగ్గిన్ టికెట్ ధరల కారంణంగా ఈ మూడు రోజులు ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తారేమో చూడాలి. ఒక వేళ ఈ ఆఫర్ వర్క్ అవుట్ అయితే కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి దీనికి పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.