సక్సెస్ పుల్ 'గోల' మళ్లీ మొదలవుతుందా?
బాలీవుడ్ కామెడీ ప్రాంచైజీ 'గోల్ మాల్' ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 17 Jun 2025 8:30 AMబాలీవుడ్ కామెడీ ప్రాంచైజీ 'గోల్ మాల్' ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ప్రాంచైజీ ఇది. 'గోల్ మాల్ ఫన్ అన్ లిమిటెడ్', ' గోల్ మాల్ రిటర్న్స్', 'గోల్ మాల్ 3', 'గోల్ మాల్ ఏగైన్' అన్ని చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోటా పోటీగా విజయం సాధించాయి. చివరిగా 'గోల్ మాల్ ఏగైన్' 2017లో రిలీజ్ అయింది.
ఆ తర్వాత మళ్లీ ఆ సిరీస్ జోలికి ఈ ద్వయం వెళ్లలేదు. తాజాగా 'గోల్ మాల్ -5' ప్రకటన వచ్చేసింది. అదే క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా 2026 లో మొదలవుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్దమవుతోంది. అ పనులన్నీ పూర్తవ్వడానికి ఏడాది సమయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి, జాన్ అబ్రహంతో కలిసి రాకేష్ మారియా బయోపిక్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.
ముంబైలో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత రోహిత్ శెట్టి 'గోల్ మాల్ -5' పనుల్లో బిజీ కానున్నాడు. వచ్చే ఏడాది మొదలు పెట్టి 2027 ప్రధమార్ధంలో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. దీంతో గోల్ మాల్ అభిమానులకు ఈ న్యూస్ స్పెషల్ ట్రీట్ లా మారింది. ఈ ప్రాంచైజీకి ప్రత్యేకమైన అభిమానులున్నారు. గోల్ మాల్ కామెడీకి థియేటర్లో పడి పడి నవ్విన ఆడియన్స్ ఎంతో మంది.
అజయ్ దేవగణ్ తో పాటు మరికొన్ని పాత్రలను రోహిత్ శెట్టి తీర్చిదిద్దిన తీరుతోనే ఇంత పెద్ద సక్సెస్ సాధ్యమైంది. అజయ్- రోహిత్ శెట్టి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. ఇద్దరి కాంబినేషన్ లో 'సింగం' ప్రాంచైజీ కూడా ఉన్న సంగతి తెలిసిందే.