Begin typing your search above and press return to search.

అనుష్క - క్రిష్.. ఈ ఘాటి కథేంటి?

దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఈ మధ్య ఆచితూచి సినిమాలు చేస్తోంది. కానీ ఆమె ఫ్యాన్ బేస్ మాత్రం అలానే ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 March 2024 5:10 AM GMT
అనుష్క - క్రిష్.. ఈ ఘాటి కథేంటి?
X

దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఈ మధ్య ఆచితూచి సినిమాలు చేస్తోంది. కానీ ఆమె ఫ్యాన్ బేస్ మాత్రం అలానే ఉంటుంది. అనుష్క సినిమాల కోసం ఫ్యాన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. హీరోయిన్ రోల్ కు మంచి ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్టులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది స్వీటీ. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో వచ్చి మంచి హిట్ కొట్టింది అనుష్క. నవీన్ పోలిశెట్టితో కలిసి నటించి అలరించింది.


ఆ మూవీ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్న అనుష్క.. ఇప్పుడు కొత్త సినిమాను ప్రకటించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మూవీ చేస్తోంది. నిజానికి ఈ సినిమా గురించి గత కొత్త రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎలాంటి సౌండ్ లేకుండా షూటింగ్ స్టార్ట్ చేశారని, ఒడిశా బోర్డర్ లో చిత్రీకరణ జరిగిందని టాక్ వినిపించింది. సెట్స్ నుంచి అనుష్క ఫోటోలు కూడా నెట్టింట లీక్ అయ్యాయి.

ఇప్పుడు ఆ వార్తలే నిజమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ను మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. మూవీ టైటిల్ ను 'ఘాటి'గా ఫిక్స్ చేశారు. గతంలో శీలావతి అనే పేరు వినిపించింది. కానీ ఎవరూ ఊహించని టైటిల్ ను ఖరారు చేశారు మేకర్స్. మరో విషయమేమిటంటే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మంగళవారం ఆ సంస్థ రిలీజ్ చేసిన లిస్ట్ లో ఘాటి పేరు కూడా ఉంది.

మేకర్స్.. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో చీరతో ముఖాన్ని కప్పి ఎడారిలో ఒంటరిగా నడుస్తున్న అనుష్కను చూపించారు. అయితే క్రిష్‌ దర్శకత్వంలో దాదాపు 14 ఏళ్ల తర్వాత స్వీటీ నటిస్తుండటం విశేషం. వీరి కాంబోలో వచ్చిన వేదం మూవీ క్లాసికల్‌ హిట్‌ స్టేటస్‌ ను అందుకుంది. అందులో వేశ్యగా కనిపించిన అనుష్క.. ఘాటిలో తనకు జరిగిన అన్యాయంపై పోరాడే మహిళ పాత్ర పోషిస్తుందని టాక్ వస్తోంది.

లేడీ ఓరియెంటెడ్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు క్రిష్. అనుష్క ముందు బాధితురాలై.. ఆ త‌ర్వాత క్రిమిన‌ల్‌ గా మారే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ అంతా ఆంధ్రా- ఒడిశా బోర్డర్ లో జరుగుతుందట. యూవీ క్రియేష‌న్స్‌ తో క‌లిసి క్రిష్‌ కు చెందిన ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2024లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల మలయాళ సినిమా కూడా ప్రకటించింది అనుష్క. ఇక స్వీటీ మళ్లీ తన స్పీడ్ పెంచుతున్నట్లు కనిపిస్తోంది