Begin typing your search above and press return to search.

10ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్..

సినిమాల్లో హారర్ కామెడీ చిత్రాలకు కాస్త క్రేజ్ ఎక్కువే ఉంటుంది.

By:  Tupaki Desk   |   23 Sep 2023 11:51 AM GMT
10ఏళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్..
X

సినిమాల్లో హారర్ కామెడీ చిత్రాలకు కాస్త క్రేజ్ ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్​లో ఇప్పటికే పలు హారర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను అందుకున్న సందర్భాలున్నాయి. అలాంటి వాటిలో 'గీతాంజలి' కూడా ఒకటి. నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టింది. రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. ఎంవివి సత్యనారాయణ ప్రొడ్యూస్ చేశారు. కోనా వెంకట్ ఈ సినిమాకు కథ అందించారు. సినిమాను కూడా ఆయనే సమర్పించారు.

అయితే 2014లో వ‌చ్చిన ఈ చిత్రానికి తాజాగా ఇప్పుడు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్​. ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి.. అంటూ అనౌన్స్ చేశారు. గీతాంజ‌లి మ‌ళ్ళీ వ‌చ్చింది.. పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కోన వెంక‌టే ఈ సినిమాకు స్టోరీ ఇవ్వడంతో పాటు నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఎమ్​వీవీ సత్యనారాయణ్ అండ్ జీవీ కలిసి ఎమ్​వీవీ సినిమా అండ్ కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్​పై నిర్మిస్తున్నారు. శివ తుర్ల‌పాటి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రవీన్ లక్కరాజు మ్యూజిక్ అందిస్తున్నారు. సుహత సిద్ధార్థ సినిమాటోగ్రఫీ చూసుకుంటున్నారు. అంజలి, శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేశ్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ తదితరులు ఈ సీక్వెల్​లో నటిస్తున్నారు. ఎడిట‌ర్‌ గా చోటా కె ప్ర‌సాద్‌, ఆర్ట్ డైరెక్టర్ గా నార్ని శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా నాగు వై బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం పోస్ట్​ ప్రొడక్షన్, స్క్రిప్ట్​ వర్క్​ కూడా పూర్తైపోయింది. తాజాగా హైదరాబాద్​లో ఈ సినిమా పూజా కార్యక్రమాలో లాంఛనంగా ప్రారంభం కూడా అయింది. పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. ఓ పాతబ‌డ్డ బంగ్లా ప్రాంగ‌ణంలో అటుగా తిరిగి కూర్చుని ఉన్న అమ్మాయిను పోస్టర్​లో చూపిస్తూ.. ఆస‌క్తితో పాటు భయపెట్టే ప్రయత్నం చేశారు.

కాగా, మొదటి భాగం గీతాంజలి.. ఎంతటి అద్భుత విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ చిత్రంతోనే నటుడు శ్రీ‌నివాస‌రెడ్డి హీరోగా సిల్వర్​ స్క్రీన్​కు పరిచయం కూడా అయ్యారు. దర్శకుడి పాత్రలో చక్కటి నటనను కనబరిచారు. బ్రహ్మానందం, సత్యం రాజేశ్​, షకలక శంకర్ తమ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేశారు. ఈ సినిమా రిలీజైన దాదాపు 10 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడం ఇంట్రెస్టింగ్​గా ఉంది.