Begin typing your search above and press return to search.

భయపెట్టేందుకు గీతాంజలి మళ్లీ...!

తెలుగమ్మాయి అంజలి హీరోయిన్ గా శ్రీనివాస్ రెడ్డి, రావు రమేష్‌, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో 2014 లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'గీతాంజలి'.

By:  Tupaki Desk   |   1 Jan 2024 9:37 AM GMT
భయపెట్టేందుకు గీతాంజలి మళ్లీ...!
X

తెలుగమ్మాయి అంజలి హీరోయిన్ గా శ్రీనివాస్ రెడ్డి, రావు రమేష్‌, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో 2014 లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'గీతాంజలి'. ఈ కామెడీ థ్రిల్లర్‌ చిత్రం వచ్చి పదేళ్లు కాబోతున్న నేపథ్యంలో యూనిట్‌ సభ్యులు సీక్వెల్‌ ను ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా అధికారికంగా సీక్వెల్‌ ను ప్రకటించారు.


'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే టైటిల్ తో రాబోతున్న ఈ సీక్వెల్‌ లో అంజలి హీరోయిన్ గా కంటిన్యూ అవ్వబోతుంది. ఇతర నటీ నటుల విషయంలో త్వరలో యూనిట్‌ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గీతాంజలి పాత్రను తీసుకుని సీక్వెల్‌ చేస్తున్నారా లేదంటే అప్పటి కథకు కొనసాగింపా అనేది తెలియాల్సి ఉంది.

సీక్వెల్‌ ఫస్ట్‌ లుక్‌ లో అంజలి కూచిపూడి డాన్సర్‌ గా, డాన్స్ భంగిమతో కనిపించింది. ఒక పురాతన భవనంలో అంజలి డాన్స్ చేస్తున్న ఫోటో ను ఫస్ట్‌ లుక్ గా విడుదల చేయడం ద్వారా ఈసారి గీతాంజలి అంతకు మించి అన్నట్లుగా భయపెట్టేందుకు రెడీ అవుతుంది అన్నట్లుగా గీతాంజలి లుక్ ఉంది.

ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ కి మంచి స్పందన వస్తోంది. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా ను 2024 ద్వితీయార్థం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.