Begin typing your search above and press return to search.

గంగం గణేశా.. ఎలా ఉంటుందంటే..

ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో చేసిన గంగం గణేశా మూవీ జూన్ 31న థియేటర్స్ లోకి వస్తోంది

By:  Tupaki Desk   |   28 May 2024 3:49 AM GMT
గంగం గణేశా.. ఎలా ఉంటుందంటే..
X

ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ శెట్టి దర్శకత్వంలో చేసిన గంగం గణేశా మూవీ జూన్ 31న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాతో వంశీ కారుమంచి నిర్మాతగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. టెక్ ప్రొఫెషనల్ అయిన వంశీ కారుమంచి తన మిత్రుడు కేదార్ సెలగం శెట్టితో కలిసి గంగం గణేశా సినిమాని హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా ప్రొడ్యూసర్ గా మారిన విషయాలను నిర్మాత వంశీ కారుమంచి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. యూఎస్ లో జాబ్స్ చేస్తూ, బిజినెస్ కూడా చేసాను. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇండియాకి రావడం జరిగింది. అయితే తరువాత మళ్ళీ అమెరికా వెళ్లి కొంతకాలం బిజినెస్ చేసి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలని అనుకున్నా.

సినిమా నిర్మాణంలోకి రావాలని ఎప్పటినుంచో ఆలోచన ఉంది. అయితే దానికి మరికొంత సమయం తీసుకోవాలని ప్లాన్ చేశాను. కరోనా కారణంగా అమెరికా తిరిగి వెళ్ళలేదు. దీంతో మూవీ చేయాలని డిసైడ్ అయ్యాను. విజయ్, ఆనంద్ నాకు మంచి ఫ్రెండ్స్. ఉదయ్ శెట్టి ఈ కథ చెప్పినపుడు ఆనంద్ తో చేస్తే బాగుంటుందని భావించి అతనికి నేరేట్ చేయడం జరిగింది.

ఆనంద్ కి కూడా కథ నచ్చడంతో మూవీ స్టార్ట్ చేసాం. గత ఏడాది వినాయక చవితికి రిలీజ్ చేయాలని అనుకున్నాం. అయితే ఆ సమయంలో కొన్ని పరిస్థితుల కారణంగా సెట్ కాలేదు. యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఈ మూవీ కథాంశం ఉంటుంది. ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్ అవుట్ అండ్ అవుట్ ఆడియన్స్ ని నవ్విస్తుంది. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన కథాంశంతో సినిమా కొనసాగుతూ ఉంటుంది.

చాలా ఫంకీగా అతని రోల్ ఈ చిత్రంలో ఉంది. మన స్నేహితుల పొరపాటు వలన కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ లో ఇరికిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో వచ్చే కామెడీ బాగుంటుంది. ఇక ఇందులో ఫ్రెండ్ గా ఇమ్మాన్యూయేల్ బాగా నవ్విస్తాడు. ఇక అమెజాన్ ప్రైమ్ తో ఓటీటీ డీల్ క్లోజ్ అయ్యింది. 400 థియేటర్స్ లో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.

నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఏపీ, కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని గంగం గణేశా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ ఖాతాలో బేబీ తర్వాత మరో బ్లాక్ బస్టర్ మూవీగా గంగం గణేశా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన ఈ కథాంశంలో కావాల్సినంత ఫన్ ఉంటుంది. సినిమాలో నయన సారిక, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్స్ గా నటించారు. వారిద్దరు మంచి పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారని నిర్మాత తెలిపారు.