Begin typing your search above and press return to search.

`గదర్ 3`ని ప్ర‌క‌టించిన అనీల్ శ‌ర్మ‌

బాలీవుడ్ సీనియ‌ర్ హీరో స‌న్నీడియోల్ గ్రేట్ కంబ్యాక్ ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అత‌డు న‌టించిన `గదర్ 2` ప్రభావం ఇంకా మర్చిపోలేదు.

By:  Tupaki Desk   |   20 Jan 2024 5:07 AM GMT
`గదర్ 3`ని ప్ర‌క‌టించిన అనీల్ శ‌ర్మ‌
X

బాలీవుడ్ సీనియ‌ర్ హీరో స‌న్నీడియోల్ గ్రేట్ కంబ్యాక్ ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అత‌డు న‌టించిన `గదర్ 2` ప్రభావం ఇంకా మర్చిపోలేదు. డియోల్ సినిమా గ‌ద‌ర్ 2 బాక్సాఫీస్ వద్ద అనూహ్య స్పందనను అందుకుంది. ఇది దేశీయ మార్కెట్‌లో రూ. 500 కోట్లకు పైగా వసూలు చేయడంతో 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అభిమానులు నాస్టాల్జియా మోడ్‌లోంచి ఇంకా బ‌య‌టికి రాలేదు. తారా సింగ్ - సకీనా జోడీ పెద్ద స్క్రీన్‌పైకి తిరిగి రావడాన్ని ఫ్యాన్స్ ఎంతో ఇష్టపడ్డారు. గదర్ 2 విడుదలైనప్పటి నుండి అభిమానులు గదర్ 3 కోసం ఉత్కంఠగా చ‌ర్చిస్తున్నారు. గదర్ 3 ఉంటుందా ఉండ‌దా? అన్న డైల‌మా ఇంత‌కాలంగా ఉంది. కానీ ఇప్పుడు ఒక శుభవార్త అందింది. గదర్ 3ని దర్శకుడు అనిల్ శర్మ త‌దుప‌రి భాగాన్ని అధికారికంగా ధృవీకరించారు. గదర్: ఏక్ ప్రేమ్ కథ - గదర్ 2 చిత్రాలను రూపొందించిన ఆయన త‌దుప‌రి పార్ట్ 3ని తెర‌కెక్కిస్తున్నాన‌ని తెలిపారు.

దర్శకుడు అనిల్ శర్మ గదర్ 3 ప్రాథమిక స్క్రిప్ట్ లాక్ అయిందని ధృవీకరించారు. సన్నీ డియోల్ పెద్ద తెరపై తారా సింగ్‌గా మళ్లీ వస్తార‌ని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఉత్కర్ష్ శర్మ, నానా పటేకర్ నటిస్తున్న చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు అనీల్ శ‌ర్మ‌ తెలిపారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన‌ తర్వాత, త‌దుప‌రి గదర్ 3 బౌండ్ స్క్రిప్ట్‌పై పనిని ప్రారంభిస్తాడ‌ని కూడా తెలుస్తోంది.

అన్నీ సానుకూలంగా జరిగితే, అభిమానులు గదర్ 3 షూటింగ్ 2025లో ప్రారంభమవుతుందని ఆశించవచ్చు. భారతదేశం-పాకిస్తాన్ వివాదం నేపథ్యంలో గ‌ద‌ర్ సిరీస్ క‌థ‌లు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి. అయితే ఈసారి పాక్ తో పోరాటం వాటా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా గుస‌గుసలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతానికి థీమ్ లైన్ ని అభివృద్ధి చేయడానికి చాలా రచనలు జరుగుతున్నాయి. ప‌లువురు ర‌చ‌యిత‌లు దీనిపై ప‌ని చేస్తున్నార‌ని తెలిసింది. కానీ తారా సింగ్, సకీనా జీతే కథ ఇక్కడ నుండి ఎక్కడికి వెళుతుందో ర‌చ‌యిత‌ల‌ బృందంతో ద‌ర్శ‌కుడు శ‌ర్మ చ‌ర్చంచి, దానికి దిశానిర్దేశం చేసార‌ని తెలిసింది

సన్నీ డియోల్ త‌దుప‌రి ప్రాజెక్ట్‌లు

గదర్ 2తో బాక్సాఫీస్ విజ‌యం తర్వాత డియోల్ బాలీవుడ్‌లోని టాప్ స్టార్‌లలో ఒకడు అయ్యాడు. ప్ర‌స్తుతం వ‌రుస‌ ప్రాజెక్ట్‌లతో క్ష‌ణం తీరిక లేకుండా ప‌ని చేస్తున్నాడు. ఇప్ప‌టికే లాహోర్: 1947 ఖ‌రారైంది. దీనిని అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. సన్నీ డియోల్ ఇటీవలే తన సినిమా సఫర్ షూటింగ్‌ను కూడా ముగించాడు. ఇందులో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. రణబీర్ కపూర్ లార్డ్ రామ్‌గా నటించ‌నున్న‌ రామాయణం లో హనుమంతుడిగా నటించడానికి సన్నీ డియోల్ చర్చలు జరుపుతున్నార‌ని కూడా టాక్ వినిపిస్తోంది. నితీష్ తివారీ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.