Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ కంటే హీరోయిన్ టవల్‌ కే వెయిట్‌ ఎక్కువ..!

దాంతో కత్రీనా టవల్ ఫైట్ కి బాగా క్రేజ్ పెరిగింది. ట్రైలర్‌ లో టవల్ ఫైట్స్ విజువల్స్ చూపించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.

By:  Tupaki Desk   |   10 Nov 2023 6:26 AM GMT
సూపర్‌ స్టార్‌ కంటే హీరోయిన్ టవల్‌ కే వెయిట్‌ ఎక్కువ..!
X

స్టార్‌ హీరో సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు మరియు అభిమానులు అంతా కూడా హీరో పాత్ర ఎలా ఉంటుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. లేడీ ఓరియంటెడ్‌ సినిమా అయితే హీరోయిన్ పాత్ర ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూడటం మనం చూస్తూ ఉంటాం. కానీ టైగర్ 3 విషయంలో పరిస్థితి చాలా విభిన్నంగా ఉంది.

టైగర్ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా కమర్షియల్‌ గా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అందుకే టైగర్ 3 పై కూడా అంచనాలు ఉన్నాయి. అయితే ఈసారి టైగర్ ను చూడాలి అనుకుంటున్న వారు సల్మాన్‌ ఖాన్‌ కోసం కాకుండా కత్రీనా టవల్‌ ఫైట్ కోసం అంటూ సోషల్‌ మీడియా ట్రెండ్‌ ను చూస్తూ ఉంటే అనిపిస్తోంది.

కత్రీనా కైఫ్‌ ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటించింది. ఆమె టవల్‌ పై ఉండి ఒక యాక్షన్‌ సన్నివేశంలో నటించింది. ఆ యాక్షన్ సన్నివేశం కోసం ఎంత కష్టపడింది, ఎలా షూటింగ్ చేసింది సోషల్ మీడియా ద్వారా పలు సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. దాంతో కత్రీనా టవల్ ఫైట్ కి బాగా క్రేజ్ పెరిగింది. ట్రైలర్‌ లో టవల్ ఫైట్స్ విజువల్స్ చూపించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.

టైగర్ సినిమాకు ఉత్తర భారతంలో బాగానే అడ్వాన్స్ బుకింగ్‌ జరుగుతోంది. అడ్వాన్స్ బుకింగ్‌ చేసుకున్న వారిలో చాలా మంది కత్రీనా టవల్ ఫైట్‌ ని చూసేందుకు సినిమాను చూడాలి అనుకుంటున్నాం అంటూ సోషల్‌ మీడియా ద్వారా అభిప్రాయం వెళ్లడించడం విడ్డూరంగా అనిపిస్తోంది.

మొత్తానికి సూపర్‌ స్టార్‌ కంటే కూడా కత్రీనా కైఫ్‌ యొక్క టవల్‌ ఫైట్ కి వెయిట్‌ ఎక్కువ అయింది అంటూ టైగర్‌ 3 సినిమా గురించి సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పఠాన్, జవాన్ లు సౌత్‌ లో మంచి వసూళ్లు నమోదు చేయడంతో టైగర్ 3 ని కూడా సౌత్‌ భాష ల్లో డబ్ చేస్తున్నారు. కానీ పెద్దగా బజ్‌ క్రియేట్‌ అవ్వక పోవడంతో అడ్వాన్స్‌ బుకింగ్‌ పెద్దగా జరగడం లేదు.

నవంబర్ 12న దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదల అవుతున్న విషయం తెల్సిందే. సల్మాన్ కి ఈ సినిమా సక్సెస్‌ అవ్వడం చాలా అవసరం. టవల్‌ వల్లో మరే కారణం వల్లో కానీ ఈ సినిమా సక్సెస్‌ అయితే చాలు అన్నట్లుగా సల్లూ భాయ్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.