Begin typing your search above and press return to search.

ఫీల్డ్ లో లేక‌పోయినా ఈ తిప్ప‌లేంటో?

దీంతో బాలీవుడ్ లోనే కొన్నాళ్ల పాటు బిజీ అయింది.

By:  Tupaki Desk   |   19 Feb 2024 8:20 AM GMT
ఫీల్డ్ లో లేక‌పోయినా ఈ తిప్ప‌లేంటో?
X

'సూప‌ర్' భామ అయేషా టాకియా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తొలి సినిమాతోనే అమ్మ‌డు అప్ప‌టి యువ‌త‌ని ఓ ఊపు ఊపేసిన బ్యూటీ. కింగ్ నాగార్జున‌తో అమ్మ‌డి రొమాంటిక్ అప్పిరియ‌న్స్ ప్ర‌త్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఆ క్రేజ్ ని అమ్మ‌డు కొన‌సాగించ‌లేకోయింది. తొలి సినిమా వైఫ‌ల్యం తో తెలుగులో కొన్ని సినిమాల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో బాలీవుడ్ లోనే కొన్నాళ్ల పాటు బిజీ అయింది.

ఇక వివాహం త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కే దూర‌మైంది. ఇప్పుడా అయేషాకి కుమారుడు కూడా ఉన్నాడు. అలా రిటైర్మెంట్ తీసుకున్న న‌టిని కూడా ట్రోల‌ర్స్ విడిచిపెట్ట‌లేదు. ఇటీవల ఆయేషా తన కుమారుడు మికైల్‌తో కలిసి విమానాశ్రయంలో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆమెని చూసి అంతా స్ట‌న్ అయిపోయారు. అయేషా ఇలా అయిపోయిందేంటి? అన్న చ‌ర్చ నెట్టింట సాగింది. కొన్ని ట్రోల్స్ సైతం తెర‌పైకి వ‌చ్చాయి.

ఆయేషా టాకియా తన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని..అందుకే ఇన్ని రోజులు ఎక్కడా కనిపిం చలేదని ట్రోల్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ ప్ర‌చారంపై ..త‌న‌పై వ‌చ్చిన ట్రోలింగ్ పై అయేషా క‌స్సు మంది. తన సోదరి ఆసుపత్రిలో ఉన్నందున రెండ్రోజుల క్రితం గోవాకు వెళ్లినట్లు తెలిపింది. ఇలాంటి బాధాకర సమయంలో తనపై ట్రోల్స్ చేస్తున్నందుకు ఆమె చాలా బాధపడుతున్నట్లు చెప్పింది.

తాను ఎలాంటి స‌ర్జ‌రీలు చేయించుకోలేద‌ని..అదంతా కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మేన‌ని కొట్టిపారేసింది. ప్ర‌స్తుతం జీవితం ఎంతో సంతోషంగా ఉంద‌ని..కుటుంబంతో అన్ని ర‌కాల సంతోషం గా ఉన్నాన‌ని తెలిపింది. అలాగే మ‌ళ్లీ సినిమాల్లోకి వ‌చ్చే ఆలోచన కూడా లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టేసింది. సినిమా ల‌కంటే ఈ జీవితం ఎంతో బాగుంద‌ని... సినిమాల‌పై ఎలాంటి ఆస‌క్తి రాద‌ని స్ప‌ష్టం చేసింది.

త‌న‌ని వ్య‌క్తిగ‌తంగా ఇలా టార్గెట్ చేయ‌డం కంటే..ఇలాంటి ప‌నులు చేయ‌డం కంటే మ‌హిళ‌ల‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డం కంటే..జీవితంలో మంచి ప‌నులు చేసి అంతా సంతోషంగా ఉండాల‌ని కోరుకుం టున్న‌ట్లు తెలి పింది. ఏ మ‌హిళ అయినా ఎప్పుడూ ఒకేలా ఉండ‌లేర‌ని 15 ఏళ్ల యువ‌తి 30 ఏళ్ల త‌ర్వాత అదే వ‌య‌సులో ఎలా ఉంటుంది. ఇలాంటి లాజిక్కులు మ‌ర్చిపోతే ఎలా అంటూ` న‌వ్వేసింది. అలాగే ఇప్ప‌టికీ త‌న‌ని అభిమానిస్తోన్న అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.