Begin typing your search above and press return to search.

అమెతో ఎంగేజ్మెంట్.. క్లారిటీ ఇచ్చిన రౌడీ హీరో!

చేసింది రెండు సినిమాలే అయినా గత కొన్నాళ్లుగా వీరిద్దరూ డీప్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, లవ్ చేసుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   19 Jan 2024 1:07 PM GMT
అమెతో ఎంగేజ్మెంట్.. క్లారిటీ ఇచ్చిన రౌడీ హీరో!
X

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య రూమర్స్ అనేవి సహజం. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ గురించి అయితే నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అలా మన టాలీవుడ్లో చూసుకుంటే గత కొన్నాళ్లుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక జంట గురించి చాలా రోజుల నుంచి ఎఫైర్ వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి మొదట 'గీతగోవిందం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.

ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. చేసింది రెండు సినిమాలే అయినా గత కొన్నాళ్లుగా వీరిద్దరూ డీప్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, లవ్ చేసుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రకరకాల వార్తలు తెరపైకి వచ్చాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.

ప్రతిరోజు ఏదో ఒకచోట వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తూ ఉండడం, పండుగల సమయంలో రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం, ఇద్దరు కలిసి ఓకే ప్లేస్ కి వెకేషన్ కి వెళ్లడం.. ఇలా ఎన్నో సంఘటనలు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని చూపించాయి. కానీ ఎప్పుడూ కూడా ఈ జంట తామిద్దరం రిలేషన్ లో ఉన్నట్టు బయటపడలేదు. ఇదిలా ఉంటే తాజాగా వీరిద్దరూ ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో స్వయంగా విజయ్ దేవరకొండ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.

ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.." నా పెళ్లి, నిషితార్థం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నాకు రెండేళ్లకోసారి పెళ్లి చేయాలని మీడియా అనుకుంటోంది. అందుకే ఇలాంటి కథనాలు బయటికి వస్తున్నాయి. ఈ రూమర్స్ నాకు అలవాటైపోయాయి. వాళ్లు స్వయంగా నన్ను పెళ్లి చేసుకోమని ఇలాంటి కథనాల ద్వారా బలవంతం చేస్తున్నారు" అంటూ చెప్పుచ్చాడు.

ఇక విజయ్ దేవరకొండ కామెంట్స్ తో విజయ్ - రష్మికల ఎంగేజ్మెంట్ వార్తలకు చెక్ పడింది. విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. 'గీతా గోవిందం' డైరెక్టర్ పరశురామ్‌తో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమ చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రష్మిక మందన్న ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ తో బిజీగా ఉంది.