బాలీవుడ్ రిస్క్ చేయడం మానేసింది
ఆల్రెడీ ఈ మినీ సిరీస్ పై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ తో పాటూ ఆలియా భట్ లాంటి వారు ప్రశంసలు కురిపించగా ఇప్పుడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మాట్లాడారు.
By: Tupaki Desk | 26 April 2025 6:55 AMఇటీవల థియేటర్లలో రిలీజవుతున్న సినిమాల కంటే ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, వెబ్సిరీస్లకే ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ కారణంతోనే ఓటీటీ కంటెంట్ చూడ్డానికి ఆడియన్స్ తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. ఓటీటీలు కూడా తమ యూజర్లను సంతృప్తి పరచడానికి మంచి కంటెంట్ ను అందిస్తూ వారిని ఎంగేజ్ చేస్తూ వస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఓటీటీలు ఎక్కువగా థ్రిల్లర్, అడ్వెంచర్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ వేదికగా రిలీజైన అడాల్సెన్స్ అనే బ్రిటీష్ వెబ్ సిరీస్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. ఆల్రెడీ ఈ మినీ సిరీస్ పై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్ తో పాటూ ఆలియా భట్ లాంటి వారు ప్రశంసలు కురిపించగా ఇప్పుడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మాట్లాడారు.
నెట్ఫ్లిక్స్ లో రిలీజైన ఈ మినీ సిరీస్ ప్రతీ ఎపిసోడ్ను సింగిల్ టేక్ లో రూపొందించి అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకున్న ఈ సిరీస్ కథ పరంగా సూపర్ హిట్ అయింది. అలాంటి కథను రూపొందిద్దామని బాలీవుడ్ లో ఎవరినైనా సంప్రదిస్తే మనల్ని పిచ్చోళ్లలా చూస్తారని, దానికి కారణం బాలీవుడ్ కొత్తదనాన్నిపూర్తిగా మర్చిపోవడమేనని ఇమ్రాన్ హష్మీ అన్నారు.
బాలీవుడ్ రిస్క్ తీసుకోవడం మానేసిందని, ఎంత కొత్తగా ఉన్నప్పటికీ ఇలాంటి కొత్త కంటెంట్ ను రూపొందించడానికి భయపడుతుందని, సోషల్ మీడియా వినియోగం వల్ల కలిగే ప్రమాదాలను ఈ సిరీస్ లో ఎంతో అద్భుతంగా చూపించారని, నాలుగు ఎపిసోడ్స్ లో ఒక్కోదాన్ని ఒకే టేక్ లో షూట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారని తెలిపారు.
ఈ విషయాన్ని బాలీవుడ్ నిర్మాతలకు చెప్తే ఎపిసోడ్ షూటింగ్ మధ్యలో ఏదైనా తప్పు జరిగితే మళ్లీ ఫస్ట్ నుంచి షూట్ చేయాలి. బడ్జెట్ ఎంత అవుతుందో తెలుసా అంటారని, ఇలాంటివి తీయాలంటే ఎంతో ధైర్యం కావాలని, బాలీవుడ్ కొత్తదనానికి పూర్తిగా దూరమైందని, ఆల్రెడీ వచ్చిన సినిమాల్లోని కంటెంట్ లోనే మార్పులు చేసి మరోసారి రూపొందిస్తున్నారని, ఇది చాలా సేఫ్ గేమ్ అని, యానిమల్ సినిమా వచ్చినప్పుడు మొదట్లో అందరూ దాన్ని విమర్శించారు కానీ ఇప్పుడు అందరూ అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారని చెప్పారు.