Begin typing your search above and press return to search.

ఆ రికార్డుకు 'డంకీ'కి అంత టైమ్ పట్టిందా?

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండుసార్లు వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు.

By:  Tupaki Desk   |   24 Dec 2023 6:44 PM GMT
ఆ రికార్డుకు డంకీకి అంత టైమ్ పట్టిందా?
X

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో రెండుసార్లు వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు. ఇక తాజాగా విడుదలైన 'డంకీ' తో హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నాడు. కానీ అది జస్ట్ అయింది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజ్ కుమార్ హిరాని షారుక్ తో చేసిన ప్రయోగం ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాకి మొదటి రోజే డివైడ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద 'డంకీ' పూర్ ఓపెనింగ్స్ ని అందుకుంది.

పఠాన్, జవాన్ సినిమాలతో పోల్చుకుంటే 'డంకీ' కి మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఎంత తక్కువ అంటే షారుక్ గత చిత్రం జవాన్ ఓపెనింగ్స్ ని బ్రేక్ చేయడానికి డంకీ సినిమాకి మూడు రోజులు పట్టింది. జవాన్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.129 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ ఏడాది ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది. కాగా ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ ని అందుకోవడానికి షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ డంకీ కి మూడు రోజుల సమయం పట్టడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే.

డంకీ బాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజులకు గాను రూ.157 కోట్లకు వసూలు చేసింది. నిజానికి షారుక్ గత చిత్రాలైన పఠాన్, జవాన్ లాగా ఈ సినిమా వేయి కోట్ల మార్క్ అందుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మూవీ లో- బడ్జెట్ లోనే తీశారు. కానీ రాజ్ కుమార్ హిరాని - షారుక్ ఖాన్ కాంబినేషన్ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరడానికి మూడు రోజుల సమయం తీసుకోవడం అభిమానులను కూడా ఎంతో నిరాశ కలిగిస్తుంది.

విడుదల రోజు పూర్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ మూవీ ఆ తర్వాత రెండు రోజులు డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది. ఈరోజు కూడా సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రేపు క్రిస్మస్ హాలిడే కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇండియాలో రూ.300 కోట్ల నెట్ కలెక్షన్స్ అలాగే ఓవర్సీస్ లో 25 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

మరి క్రిస్మస్ హాలిడేని క్యాష్ చేసుకొని రానున్న రోజుల్లో డంకీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవుతుందేమో చూడాలి. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్, రాజ్ కుమార్ హిరాని ఫిలిమ్స్ బ్యానర్స్ పై షారుక్ భార్య గౌరీ ఖాన్, రాజ్ కుమార్ హిరాని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. షారుక్ ఖాన్ సరసన తాప్సి హీరోయిన్గా నటించగా.. విక్కీ కౌశల్, బొమన్ ఇరానీ, సునీల్ గ్రోవర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.