Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు..క్లారిటీ ఇచ్చిన హీరో నవదీప్!

తాజాగా హైదరాబాద్ మాదాపూర్ డగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   14 Sep 2023 4:07 PM GMT
డ్రగ్స్ కేసు..క్లారిటీ ఇచ్చిన హీరో నవదీప్!
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్​ కలకలం రేపుతోంది. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ డగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తెలుగు నటుడు నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. నవదీప్​కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు సీపీ సీవీ ఆనంద్ చెప్పారని ప్రచారం సాగుతోంది. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వివరాళ్లో వెళితే.. కొన్నేళ్ల క్రితం మాదాపూర్​ డ్రగ్స్ కేసు కలకం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురిని పోలీసు అధికారులతో పాటు ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించారు. అప్పట్లో ఈ విషయంపై పెద్ద దుమారమే రేపింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసినట్లు సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మరి కొందరు పరారీలు ఉన్నట్లు చెప్పారు.

"చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమంది ఫ్యామీలితో సహా పరారీలు ఉన్నారు. ఫోన్లు స్విచ్ఛాఫ్​లో ఉన్నాయి. మేఘన సినిమా డైరెక్టర్​, ఇంద్రతేజ్​, నవదీప్​, శ్వేతా, కార్తిక్​.. ఇలా పలువురు పరారీలు ఉన్నారు" అని పేర్కొన్నారు.

అయితే ఈ పేర్లలో సోషల్​ మీడియాలో నవదీప్​ పేరు హైలైట్​ అయింది. ఈ పేరు హీరో నవదీప్​ ​​ అని ప్రస్తుతం సోషల్​ మీడియాలో రాగా.. పలు వెబ్​సైట్లు నవదీప్​ పేరును ప్రస్తావిస్తూ కథనాలు కూడా రాసేశాయి.

అయితే తాను పరారీలో ఉన్నట్లు జోరుగా సాగుతున్న ప్రచారంపై నటుడు నవదీప్​ స్పందించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, హైదరాబాద్​లోనే ఉన్నానని స్పష్టత ఇచ్చారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంది సంబంధం లేదని పేర్కొన్నారు. ఇకపోతే నవదీప్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిసారిగా 2021లో మోసగాళ్లు చిత్రంలో కనిపించారు. అయితే వెబ్​సిరీస్​లో కనిపిస్తున్నారు. ఈ మధ్యే న్యూస్​ సెన్స్​, మాయా బజార్​ ఫర్ సేల్​ వంటి సిరీస్​లో నటించారు. ప్రస్తుతం ఈగల్, లవ్​ మౌలి అనే చిత్రాల్లో నటిస్తున్నారు.