Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్ ఇంత సీక్రెట్ ఎందుకో..?

రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా ఆ హిట్ ని రిపీట్ చేసేందుకు అదే సినిమా సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్నారు

By:  Tupaki Desk   |   23 March 2024 5:30 PM GMT
డబుల్ ఇస్మార్ట్ ఇంత సీక్రెట్ ఎందుకో..?
X

రామ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కాగా ఆ హిట్ ని రిపీట్ చేసేందుకు అదే సినిమా సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్నారు. రామ్ స్కంద తర్వాత చేస్తున్న డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి పూరీ తన మ్యాడ్నెస్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో విలన్ గా సంజయ్ దత్ ని తీసుకున్నప్పుడే పూరీ పెద్ద స్కెచ్ వేశాడని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.

డబుల్ ఇస్మార్ట్ లో యాక్షన్ సీన్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ లో ఉన్నాయని తెలుస్తుంది. అందుకే పూరీ రాం ఇద్దరు డబుల్ ఇస్మార్ట్ మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా టార్గెట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో రిలీజ్ డేట్ విషయంలో కంగారు పడనవసరం లేదని అనుకున్నారు. అందుకే మార్చి 8న రిలీజ్ చేయాల్సిన సినిమాను సమ్మర్ తర్వాత రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ డబుల్ ఇస్మార్ట్ లో హీరోయిన్స్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు.

ఇస్మార్ట్ శంకర్ లో నిధి అగర్వాల్, నభా నటేష్ ఇద్దరు సినిమాకు కావాల్సినంత గ్లామర్ తెచ్చారు. ఇద్దరిని పూరీ జగన్నాథ్ పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. అయితే డబుల్ ఇస్మార్ట్ లో కూడా వీరిని రిపీట్ చేస్తారని అనుకున్నా అది జరగట్లేదని తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ ఇప్పటివరకు ఇచ్చిన అప్డేట్స్ లో హీరోయిన్స్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. కావాలని సీక్రెట్ గా ఉంచుతున్నారా లేదా హీరోయిన్స్ విషయాన్ని లైట్ తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

విజయ్ దేవరకొండతో పూరీ చేసిన లైగర్ హిట్ ఐతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో పూరీని నమ్మి సినిమా చేసే హీరోలు లేకుండా అయిపోయింది. ఆ టైం లో రామ్ మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. ఇస్మార్ట్ శంకర్ ముందు కూడా పూరీ డౌన్ లో ఉండగా రామ్ డేర్ చేసి పూరీతో సినిమా చేశాడు. మరి ప్రస్తుతం హీరో డైరెక్టర్ ఇద్దరు కూడా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి.. మరి ఈసారి కూడా ఇద్దరు మ్యాజిక్ చేస్తారా లేదా అన్నది చూడాలి.