Begin typing your search above and press return to search.

11 రోజుల తర్వాత నటి దివ్య మృతదేహం లభ్యం

హత్య చేసిన తర్వాత దివ్యా మృతదేహంను హంతకులు పంజాబ్ లోని భాఖ్‌డా కెనాల్‌ లో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి మృతదేహం హర్యానా కు కొట్టుకు వచ్చిందని కూడా పోలీసులు గుర్తించారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 9:07 AM GMT
11 రోజుల తర్వాత నటి దివ్య మృతదేహం లభ్యం
X

మోడల్ గా నటిగా సుపరిచితురాలు అయిన దివ్యా పాహుజా ఈనెల 2వ తారీకున గురుగ్రామ్‌ లోని హోటల్‌ లో హత్య గావించబడ్డ విషయం తెల్సిందే. హత్య చేసిన వారు ఆమె మృతదేహంను తరలిస్తూ ఉన్న సమయంలో సీసీ కెమెరాకు చిక్కారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఎంక్వౌరీ మొదలు పెట్టారు.

గత 11 రోజులుగా దివ్యా పాహుజా యొక్క మృతదేహం కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. నాలుగు అయిదు టీమ్స్ గా పోలీసులు విడిపోయి మృతదేహం మరియు హత్య చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మృతదేహం లభ్యం అయ్యింది.

హత్య చేసిన తర్వాత దివ్యా మృతదేహంను హంతకులు పంజాబ్ లోని భాఖ్‌డా కెనాల్‌ లో పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి మృతదేహం హర్యానా కు కొట్టుకు వచ్చిందని కూడా పోలీసులు గుర్తించారు. కెనాల్ నుంచి మృతదేహం తీసి పోస్ట్‌మార్టంకు తరలించారు.

ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌ కి పాల్పడుతున్న కారణంగానే దివ్యా ను హత్య చేసినట్లుగా నిందితుల్లో ఒక్కరు అయిన అభిజీత్ విచారణ లో పేర్కొన్నాడు అంటూ పోలీసులు తెలియజేశారు. ఈ కేసు విషయమై మరింత స్పీడ్‌ గా విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారులు మీడియాతో చెప్పుకొచ్చారు.