Begin typing your search above and press return to search.

బేబీ డైరెక్టర్ భయపడుతున్నాడా..?

దీంతో, మరింత గా ట్రోల్ చేస్తారేమో అనే కారణంతోనే ఆయన తన ఎకౌంట్ ని తీసేశారని, ఆ విషయంలో సాయి రాజేష్ భయపడుతున్నాడని కొందరు అంటున్నారు.

By:  Tupaki Desk   |   21 Aug 2023 12:45 PM GMT
బేబీ డైరెక్టర్ భయపడుతున్నాడా..?
X

ఈ మధ్యకాలంలో విడుదలై, సంచలనం సృష్టించిన సినిమా బేబీ. చిన్న సినిమాగా విడుదలై ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీ హిట్ కావడమే కాదు, కాసుల వర్షం కూడా కురిపించింది. ఈ మూవీ చూడటానికి ప్రేక్షకులు క్యూలు కట్టారు. చాలా మంది ఈ సినిమాలో తమ కథను ఓన్ చేసుకొని మరీ చూశారు. అందుకే అంత క్లిక్ అయ్యింది.

ఈ మూవీ తర్వాత ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ని ఘోరంగా తిడుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. నిజానికి మీమర్స్ కారణంగా కూడా ఈ మూవీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. థియేటర్ లో ఇంత హిట్ అయిన ఈ సినిమా ని ఓటీటీలోకి తీసుకువస్తున్నారు. ఈ నెల 25 న ఈ మూవీ ఓటీటీకి రానుంది.

ఈ క్రమంలో డైరెక్టర్ సాయి రాజేష్ షాకింగ్ స్టెప్ తీసుకున్నారు. ఆయన ట్విట్టర్ లో తన ఎకౌంట్ ని డీ యాక్టివేట్ చేశారు. ఆయన సడెన్ గా ఇలా ఎందుకు చేశారా అనేది ఇప్పుడు అందరినీ షాకింగ్ కి గురి చేసింది. అయితే, దీనికి కారణం ఉందని కొందరు అంటున్నారు. మూవీ ఓటీటీలో వస్తున్న కారణం చేతే ఆయన ట్విట్టర్ లో డీ యాక్టివ్ అయ్యారని వారు చెబుతున్నారు.

ఈ మూవీ రిలీజ్ అయిన సమయంలో కొన్ని డైలాగుల విషయంలో డైరెక్టర్ ని విమర్శించిన వారు కూడా ఉన్నారు. ఇక ఓటీటీలో థియేటర్ లో కట్ చేసిన సీన్స్ ని కూడా యాడ్ చేసి విడుదల చేస్తున్నారట.

ఆ సీన్స్ థియేటర్ లో చూసిన వాటికంటే మరింత బోల్డ్ గా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో, మరింత గా ట్రోల్ చేస్తారేమో అనే కారణంతోనే ఆయన తన ఎకౌంట్ ని తీసేశారని, ఆ విషయంలో సాయి రాజేష్ భయపడుతున్నాడని కొందరు అంటున్నారు. అసలు కారణం ఏంటి అనేది మాత్రం తెలియలేదు.

అయితే, ఆయన కేవలం ట్విటర్ లోనే ఎకౌంట్ ఇన్ యాక్టివ్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండటం విశేషం. ఇన్ స్టా లో ఆయనే స్వయంగా ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ ని షేర్ చేశారు. ఇక ఈ మూవీలో వైష్ణవి చైతన్య లీడ్ రోల్ చేశారు. ఆనంద్ దేవర కొండ, విరాజ్ అశ్విన్ లు హీరోలుగా నటించారు. థియేటర్ లోనే ఇంత హిట్ అయిన ఈ సినిమా, ఓటీటీలో మరెంత అదరగొట్టనుందో చూడాలి.