Begin typing your search above and press return to search.

డైరెక్టర్ ఇంట్లో అవార్డులను ఎత్తుకెళ్లిన దొంగలు..!

అయితే అది సరిపోదు అన్నట్టు డైరెక్టర్ కి వచ్చిన జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పతకాలను కూడా దొంగలు తీసుకెళ్లారట

By:  Tupaki Desk   |   9 Feb 2024 2:13 PM GMT
డైరెక్టర్ ఇంట్లో అవార్డులను ఎత్తుకెళ్లిన దొంగలు..!
X

ప్రముఖ దర్శకుడి ఇంట్లో దొంగలు పడ్డారు. తాళాలు వేసి ఉన్న డైరెక్టర్ ఇంటి తాళాలు పగలగొట్టి మరీ చొరబడి నగదు, బంగారు నగలతో పాటుగా అవార్డులను కూడా ఎత్తుకెళ్లారు. కోలీవుడ్ డైరెక్టర్ మణికందన్ ఇంట్లోనే ఈ సంఘటన జరిగింది. ఇంట్లో ఎవరు లేని టైం చూసిన దొంగలు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న లక్ష రూపాయలు, ఐదు సవర్ల బంగారు నగలు ఎత్తుకెళ్లారు.

అయితే అది సరిపోదు అన్నట్టు డైరెక్టర్ కి వచ్చిన జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పతకాలను కూడా దొంగలు తీసుకెళ్లారట. డైరెక్టర్ ఇంట్లో చోరీ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అయితే ఇది జరిగినప్పుడు మణికందన్ చెన్నైలోనే ఉన్నట్టు తెలుస్తుంది.

ఫోటో గ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించిన మణికందన్ ఆ తర్వాత అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా ఛాన్స్ అందుకున్నారు. అయితే ఆ టైం లో మణికందన్ విండ్ అనే షార్ట్ ఫిల్మ్ తో డైరెక్టర్ వెట్రిమారన్ దృష్టిలో పడిన మణికందన్ ఆయన నిర్మాతగా తొలి అవకాశం ఇవ్వగా కాకా ముట్టై సినిమా తెరకెక్కించారు. ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వడమే కాదు 62వ నేషనల్ అవార్డుల్లో రెండు పురస్కారాలను దక్కించుకుంది.అంతేకాదు 13వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజిల్స్ లో కూడా బెస్ట్ ఫీచర్ గా ఆడియన్స్ అవార్డుని సొంతం చేసుకుంది.

మణికందన్ ప్రస్తుతం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో ఒక వెబ్ సీరీస్ చేస్తున్నారు. డిస్నీ హాట్ సార్ లో రాబోతున్న ఈ వెబ్ సీరీస్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. మణికందన్ కేసు విషయంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. డైరెక్టర్ ఇల్లు అని తెలిసి వెళ్లారో లేదా వెళ్లాక తెలిసిందో కానీ చోరీకి డబ్బులు, నగదు కాకుండా అక్కడ ఉన్న అవార్డులను కూడా దొంగిలించడం మాత్రం అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. అవార్డులకు వచ్చిన రజత పతకాలను కూడా కాజేశారు దొంగలు. డైరెక్టర్ కంప్లైంట్ తో పోలీసులు సీరియస్ గానే విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది.