Begin typing your search above and press return to search.

పెళ్లి విషయంలో ట్రోల్స్ - దిల్ రాజు ఏమన్నారంటే?

అందులో సోషల్ మీడియా ట్రోల్స్‌పై, నెగెటివిటీపై తనదైన శైలిలో స్పందించారు.

By:  Tupaki Desk   |   5 April 2024 10:45 AM GMT
పెళ్లి విషయంలో ట్రోల్స్ - దిల్ రాజు ఏమన్నారంటే?
X

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. 2003లో 'దిల్' సినిమాతో ఆయన ప్రొడ్యూసర్ గా పరిచయమయ్యారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ మూవీ వచ్చి సరిగ్గా నేటికి 21 ఏళ్ళు పూర్తయింది. తనకు ఎంతో ప్రత్యేకమైన అదే ఏప్రిల్ 5వ తేదీన మళ్ళీ ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' చిత్రాన్ని రిలీజ్ చేసారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీమర్స్, యూట్యూబర్స్ తో దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో సోషల్ మీడియా ట్రోల్స్‌పై, నెగెటివిటీపై తనదైన శైలిలో స్పందించారు.

''నాకు ఇంతకముందు అసలు మీమ్స్ గురించి అవగాహన కూడా లేదు. 'అది దా సార్' కంటే ముందు నా మీద మీమ్స్ వచ్చాయి. నా మ్యారేజ్ తర్వాత ఓ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. అందులో నా భార్య వైగా ను ఎలా కలిశాను, ఎలా కనెక్ట్ అయ్యాననేది చెప్పాను. ఆ వీడియోపై ట్రోల్స్ చేశారు. 'అబ్బా మామా.. మస్త్ లక్కీ ఛాన్స్ కొట్టాసావే' అంటూ మీమ్ వచ్చిందని నా భార్య నాకు చూపించింది. కానీ నేను వాటి గురించి పట్టించుకోను'' అని దిల్ రాజు తెలిపారు. ట్రోల్స్ అనేవి పాసింగ్ క్లౌడ్స్ అని, తాను ఆకాశం లాంటి వాడినని, మేఘాలకు భయపడనని అన్నారు.

''ప్రపంచంలో 14 కోట్ల కంటే ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్లలో నన్ను గుర్తు పట్టేవారు ఒక కోటి మంది ఉంటారు అనుకుందాం. నాపై కామెంట్స్‌ చేసేవాళ్లు పదివేల మంది ఉండొచ్చు. నెగెటివ్ కామెంట్స్‌ చేసే ఈ 10 వేల మంది గురించి పట్టించుకుంటే, నేను మిగిలిన 99 లక్షల 99 వేల ముందికి దూరమవుతాను. మనం ఈ సొసైటీలో ఎక్కువ నెగిటివ్ వైబ్ లో బ్రతుకుతున్నాం. నేను ఇక్కడ ఎవరినీ తప్పుపట్టడం లేదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా నెగిటివ్ వైబ్స్ ఉంటున్నాయి. దాని వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. కాబట్టి ఆ నెగిటివిటీని మన దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తగా ఉంటే, పాజిటివ్ గా చాలా హ్యాపీగా ఉంటాం. అయినా అవ్వన్నీ వస్తూ పోతూ ఉండే మేఘాల్లాంటివి. అవేం నన్ను చంపేస్తాయా? చంపలేవు కదా.. అలాంటి మేఘాలు వెళ్ళిపోగానే మనకు చాలా స్పష్టమైన ఆకాశం కనిపిస్తుంది. మనం ఆకాశం లాంటి వాళ్ళం. మేఘాలకు భయపడితే ఎలా?'' అని దిల్ రాజు చెప్పుకొచ్చారు.

'ఫ్యామిలీ స్టార్' మూవీ ప్రమోషన్స్ లో డ్యాన్స్ చేయడం గురించి కూడా దిల్ రాజు మాట్లాడారు. ''నేను 'మిర్చి' ఆడియో ఫంక్షన్ లోనే డ్యాన్స్ చేశా. ఇప్పుడు కొత్తగా చేయడమేంటి. దేవిశ్రీ ప్రసాద్ తో ప్రభాస్, రాజమౌళి, అనుష్క, నేనూ కలిసి స్టేజ్ మీద ఒక స్టెప్ వేశాం. అది అప్పటి మూడ్ కు తగ్గట్టుగా ఆ మూమెంట్ లో అలా జరిగింది'' అని చెప్పారు. ఇక 21ఏళ్ల క్రితం తన మొదటి సినిమా 'దిల్‌' విడుదలైన రోజునే ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' రిలీజ్ అవుతుండటంతో ఎంతో ఆనందంగా ఉందని దిల్ రాజు చెప్పారు.

కాగా, దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ - మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్'. పరుశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇందులో జగపతిబాబు, రోహిణి హట్టంగడి, వాసుకి, అభినయ, రవిప్రకాష్, రాజా చెంబోలు, రవిబాబు, అజయ్ ఘోష్, అచ్యుత్ కుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.