Begin typing your search above and press return to search.

మరోసారి దిల్ రాజు మైత్రి క్లాష్.. పవర్ఫుల్ ఫైట్

మరల దసరా బరిలో ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు పవన్ కళ్యాణ్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడబోతున్నారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 4:39 AM GMT
మరోసారి దిల్ రాజు మైత్రి క్లాష్.. పవర్ఫుల్ ఫైట్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ దేవర. ఈ మూవీ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాని అక్టోబర్ 10కి రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. ఏప్రిల్ 5 అని ముందుగా అనుకున్న చాలా కారణాల వలన వెనక్కి వెళ్ళింది. అయితే దసరా రేసులో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఈ సినిమాకి సంబందించిన నైజాం రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్సీ ధరకి నైజాం హక్కులని మైత్రీ వారు దక్కించుకున్నారంట. నైజాం అంటే ఎక్కువగా దిల్ రాజు పేరు వినిపిస్తూ ఉంటుంది. నైజాంలో సింగిల్ స్క్రీన్స్ లో చాలా వరకు దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి. ఓజీ మూవీ నైజాం రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నారు. దసరాకి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

సంక్రాంతి రేసులో దిల్ రాజు గుంటూరు కారం సినిమాతో రాగా మైత్రీ వారు హనుమాన్ సినిమాతో వచ్చారు. ఈ రెండు డిస్టిబ్యూషన్ కంపెనీల మధ్య పోటీ ఏర్పడింది. మరల దసరా బరిలో ఇటు జూనియర్ ఎన్టీఆర్, అటు పవన్ కళ్యాణ్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పై పోటీ పడబోతున్నారు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.

అలాగే ఇద్దరు హీరోలకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాలపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాల మధ్య పోటీ అంటే కచ్చితంగా థియేటర్స్ విషయంలో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పొచ్చు. సంక్రాంతి రేసులో దిల్ రాజు, మైత్రీ నిర్మాతలు పోటీ పడగా హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ లాభాలు తెచ్చి పెట్టింది.

దసరా రేసులో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మధ్య జరిగే పోటీలో రెండు సినిమాలు విజేతగా మారే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. ఈ రెండు చిత్రాలు పవర్ ఫుల్ మాస్ యాక్షన్ కథలతోనే తెరకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో కచ్చితంగా రెండు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వొచ్చని భావిస్తున్నారు.