Begin typing your search above and press return to search.

రాజు గారి నమ్మకాన్ని 'యానిమల్‌' నిలిపేనా?

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో దాదాపు 15 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 1:22 PM GMT
రాజు గారి నమ్మకాన్ని యానిమల్‌ నిలిపేనా?
X

రణబీర్ కపూర్‌ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌ గా రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు దర్శకుడు అవ్వడంతో పాటు హీరోయిన్‌ రష్మిక మందన్న కి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ నేపథ్యం లో యానిమల్‌ తెలుగు డబ్బింగ్ వర్షన్ కి మంచి బిజినెస్ జరిగిందని సమాచారం.

ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో దాదాపు 15 కోట్ల రూపాయలకు ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. సాధారణంగా అయితే రణబీర్ కపూర్ సినిమాకు తెలుగు బాక్సాఫీస్ వద్ద అంత మార్కెట్‌ లేదు. కానీ హీరోయిన్ మరియు దర్శకుడి కారణంగా తెలుగు ప్రేక్షకుల్లో యానిమల్ పై ఆసక్తి నెలకొంది.

ఆ ఆసక్తి అడ్వాన్స్ బుకింగ్‌ రూపంలో క్లీయర్‌ గా కనిపిస్తోంది. హైదరాబాద్‌ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మల్టీ ప్లెక్స్ ల్లో అడ్వాన్స్ బుకింగ్‌ భారీ ఎత్తున జరుగుతోంది. దిల్‌ రాజు విడుదలకు ముందు రోజు పెద్ద ఎత్తున పెయిడ్‌ ప్రీమియర్ లు వేయాలని కూడా ప్లాన్‌ చేస్తున్నాడట.

సినిమాకు వచ్చిన ముందస్తు బజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ రావడం కన్ఫర్మ్‌ అయింది. టాక్ ని బట్టి సినిమా లాంగ్ రన్ వసూళ్లు ఉంటాయి. దిల్‌ రాజు మొదటి మూడు లేదా నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించే విధంగా పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్‌ చేస్తున్నాడని కూడా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రణబీర్ కపూర్ కోసం కాకున్నా రష్మిక మరియు సందీప్ వంగ కోసం తెలుగు ప్రేక్షకులు యానిమల్ థియేటర్ కి క్యూ కట్టడం కన్ఫర్మ్‌. కనుక దిల్‌ రాజు అనుకున్నట్లుగా ఈజీగా బ్రేక్ ఈవెన్‌ అవ్వడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. దిల్‌ రాజు వేసిన లెక్కలు తప్పవు. యానిమల్ విషయంలో కచ్చితంగా లెక్కలు అమలు అయితే రాజు గారికి లాభాలు భారీగా దక్కే అవకాశాలు ఉన్నాయి.