Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ తీసుకోలేదు.. ఆల్క‌హాల్ వ‌దిలేసాను: శ్రుతిహాస‌న్

శ్రుతిహాస‌న్ ఆల్క‌హాలిక్ అని, సిగరెట్లు తాగుతుంద‌ని, డ్ర‌గ్స్ తీసుకుంటుంద‌ని కూడా ర‌క‌ర‌కాల పుకార్లు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   18 Dec 2023 4:21 AM GMT
డ్ర‌గ్స్ తీసుకోలేదు.. ఆల్క‌హాల్ వ‌దిలేసాను: శ్రుతిహాస‌న్
X

బ‌య‌టికి తెలియ‌నివ్వ‌కుండా ర‌హ‌స్యంగా దాచేయ‌డం కొంద‌రి అల‌వాటు. ఉన్న‌ది ఏదైనా నిర్మొహ‌మాటంగా బ‌య‌టికి మాట్లాడేయ‌డం మ‌రికొంద‌రికి అల‌వాటు. ఈ రెండో కేట‌గిరీకి చెందుతుంది శ్రుతిహాస‌న్. శ్రుతిహాస‌న్ ఆల్క‌హాలిక్ అని, సిగరెట్లు తాగుతుంద‌ని, డ్ర‌గ్స్ తీసుకుంటుంద‌ని కూడా ర‌క‌ర‌కాల పుకార్లు ఉన్నాయి. ఇప్పుడు వాట‌న్నిటిపైనా శ్రుతి తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడింది.

అందాల క‌థానాయిక శ్రుతి హాసన్ తాను ఎనిమిదేళ్లుగా ఆల్కహాల్ లేని జీవితాన్ని గ‌డుపుతున్నాన‌ని తెలిపింది. పాడ్‌కాస్ట్ అన్‌ట్రిగ్గర్డ్ విత్ అమిన్‌జాజ్‌లో మాట్లాడుతూ.. శ్రుతి ఆల్కహాల్‌తో తనకున్న గత సంబంధాన్ని ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన ఉద్య‌మాన్ని ప్రస్థావించింది. నేను తాగడానికి అలవాటు పడ్డాను కానీ ఎనిమిదేళ్లుగా హుందాగా ఉన్నాను. కానీ తాగ‌న‌ప్పుడు పార్టీ క్రౌడ్‌ని తట్టుకోవడం కష్టం! అని కూడా అన్నారు.

నాకు పశ్చాత్తాపం లేదు. జీరో హ్యాంగోవర్లు ఉన్నాయి.. హుందాగా ఉండటమే ఉత్తమం! అని శ్రుతి అంది. ఆల్క‌హాల్ సేవ‌నం అనేది ఒక దశ.. జీవితాంతం అలా ఉండాల‌నుకుంటే ఉండండి..కానీ మద్యం నా జీవితంలో ఒక పెద్ద విషయం ఇప్పుడు! అని అంది. అలాగే తాను ఎప్పుడూ డ్రగ్స్‌కు అలవాటు పడలేదని స్పష్టం చేసిన శ్రుతి మద్య రహిత జీవితం అల‌వాటైంద‌ని తెలిపారు. నేను ఎప్పుడూ హంగోవ‌ర్ తో ఉండేదానిని. ఎల్లప్పుడూ నా స్నేహితులతో కలిసి తాగాలనుకునేదానిని అని తెలిపింది. చివ‌రికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాను.. నాపై నేను మరింత నియంత్రణలోకి వ‌చ్చాను.. అని తెలిపారు. ``సామాజిక పరిస్థితులను ఎదుర్కోవ‌డం గమ్మత్తైనదని కూడా శ్రుతి అంగీకరించింది. నేను చాలా మంది వ్యక్తుల నుండి దూరంగా ఉన్నాను. ముఖ్యంగా ఫ్రీలోడర్లు. వారు నిరంతరం పార్టీలకు వెళ‌దామ‌ని అంటారు. అలాంటి వారే నా మద్యపాన అలవాట్లను తీవ్రతరం చేశారు`` అని వెల్లడించింది.

వృత్తిరీత్యా చూస్తే... శ్రుతి చివరిసారిగా నాని - మృణాల్ ఠాకూర్ నటించిన `హాయ్ నాన్నా`లో అతిధి పాత్రలో కనిపించింది. సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ -పృథ్వీరాజ్ సుకుమారన్ త‌దిత‌రులు న‌టించారు. ఈ యాక్షన్ డ్రామా డిసెంబర్ 22న విడుదల కానుంది.