Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయి స్పీడుకి డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ బ్రేకులు

చాలాకాలం పాటు వాయిదా పడిన తమిళ చిత్రాలలో ఒకటిగా ధృవ న‌క్ష‌త్రం మిగిలిపోయింది.

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:00 AM GMT
తెలుగ‌మ్మాయి స్పీడుకి డైరెక్ట‌ర్ గౌత‌మ్ మీన‌న్ బ్రేకులు
X

టాలీవుడ్ లో 'పెళ్లి చూపులు' చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకుంది రీతూవ‌ర్మ‌. ఆ సినిమాతో న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది. అటుపై తెలుగ‌మ్మాయి రీతూవ‌ర్మ బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమాల్లో న‌టించింది. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని మ‌లుపు. త‌న‌కు గౌత‌మ్ మీన‌న్ ప‌రిచ‌యం అవ్వ‌డం క‌థ‌ను మ‌లుపు తిప్పింద‌ని చెప్పాలి.

గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన 'ధృవ నచ్చతిరమ్' (ధృవ‌న‌క్ష‌త్రం)లో ఏకంగా చియాన్ విక్ర‌మ్ స‌ర‌స‌న అవ‌కాశం ద‌క్కించుకుంది. కానీ రీతూ తానొక‌టి త‌లిస్తే అన్న చందంగా అయింది. చాలాకాలం పాటు వాయిదా పడిన తమిళ చిత్రాలలో ఒకటిగా ధృవ న‌క్ష‌త్రం మిగిలిపోయింది. స్పై థ్రిల్లర్ గత 7 సంవత్సరాలుగా తెర‌కెక్కుతూనే ఉంది. థియేట్రిక‌ల్ విడుద‌ల‌కు సంబంధించి తేదీ వాయిదా ప‌డుతూనే ఉంది. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం ఈ సంవత్సరం థియేటర్లలోకి వస్తుందని భావిస్తున్నారు.

ఇప్పుడు కొత్త అప్‌డేట్ ప్ర‌కారం..మేకర్స్ కొత్త ట్రైలర్‌ను రూపొందించారు. అది సెన్సార్ గ‌డ‌ప‌పై ఉంది. కొత్త ట్రైలర్‌లో ఐశ్వర్య రాజేష్‌కి సంబంధించిన సన్నివేశాలు ఉండవు. అలాగే ఈ చిత్రం కొత్త వెర్షన్ నుండి ఐశ్వ‌ర్య న‌టించిన సీన్ల‌ను కూడా తొలగించినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. క‌నీసం ఇది ఇప్ప‌టికి అయినా రిలీజైతే తెలుగ‌మ్మాయి రీతూకి మంచి పేరొస్తుందేమో చూడాలి.

స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో విక్రమ్, రీతూ వర్మ, సిమ్రాన్, పార్థిబన్, దివ్యదర్శిని, అర్జున్ దాస్, వినాయకన్, రాధికా శరత్‌కుమార్, వంశీకృష్ణ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం హారిస్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు.