Begin typing your search above and press return to search.

కుమారి పాప 'ధూం ధాం'.. ఇలాంటి లుక్కా..

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలు కూడా నిత్యం వైరల్ గా మారుతూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   6 March 2024 7:29 AM GMT
కుమారి పాప ధూం ధాం.. ఇలాంటి లుక్కా..
X

కుమారి 21ఎఫ్ సినిమాతో హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. చూడగానే అందమైన చిరునవ్వుతో ఆకర్షించే ఈ అమ్మడు మొదట్లోనే చాలా గ్లామరస్ హీరోయిన్ గా హైలెట్ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన గ్లామరస్ ఫోటోలు కూడా నిత్యం వైరల్ గా మారుతూనే ఉంటాయి. ఇక ఆమె అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్స్ తో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.

ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలో మాత్రం ఈ కుమారి పాప ఊహించని క్యారెక్టర్ తో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. చేతన్ కృష్ణ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "ధూం ధాం" సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. అందులో హెబ్బా పటేల్ అచ్చమైన తెలుగు అమ్మాయిలా ట్రెడిషనల్ లుక్కుతో కనిపించింది.

హీరో చేతన్ ఇదివరకే కొన్ని డిఫరెంట్ సినిమాలతో మంచి నటుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు, బీచ్ రోడ్ చేతన్, రోజులు మారాయి.. వంటి సినిమాలు చేశాడు. ముఖ్యంగా రోజులు మారాయి సినిమా కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. చేతన్ ఈసారి మరో వినూత్నమైన కథతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. చేతన్ లుక్ కూడా ఈ సినిమాలో నేచురల్ గా, పక్కింటి కుర్రాడిలా మనలో ఒకడిగా కనిపిస్తున్నాడు. ఇక "ధూం ధాం" సినిమా పక్కా లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రెడీ సినిమా తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు ఎల్లప్పుడూ గ్లామర్ లేదా పొట్టి దస్తుల్లో ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే హెబ్బా పటేల్ హఠాత్తుగా ట్రెడిషన్ లుక్ ల్ కనిపించేసరికి కుర్రాళ్ళు షాక్ అవుతున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ ఫ్రేమ్ లో ప్రముఖ నటీనటులు కూడా హైలెట్ అవుతున్నారు. వెన్నెల కిషోర్ తో పాటు సాయికుమార్, పృథ్వీరాజ్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాకు ప్రముఖ రైటర్ గోపి మోహన్ కథ స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండడం విశేషం. ఆయన ఎక్కువగా శ్రీనువైట్ల సినిమాలకు వర్క్ చేశారు. రెడీ, దూకుడు, బాద్షా వంటి హిట్ సినిమాలకు కథ రచయితగా వర్క్ చేశారు. మొత్తానికి ఈ ధూం ధాం పర్ఫెక్ట్ కాంబినేషన్ లో కలర్ఫుల్ గా రాబోతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై రామ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహిస్తున్నారు ఇక సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇక సినిమాను ఈ సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటూ ఉన్నారు. కలర్ఫుల్ గా ఉన్న ఫస్ట్ లుక్ ద్వారానే ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత హెబ్బా పటేల్ కు ఒక మంచి అవకాశం దొరికినట్లుగా అనిపిస్తోంది. ఇక ఎలాగైనా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని తన కెరీర్ ను ఒక ట్రాక్లోకి తీసుకురావాలని అనుకుంటుంది. మరి ఈ సినిమా అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.