Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లిలో ఎంఎస్ ధోనీతో చ‌ర‌ణ్ దాండియా

గుజరాత్‌లోని జామ్‌నగర్ జామ్ అయిపోయింది. సెల‌బ్రిటీ కిట‌కిట‌తో న‌గ‌రం ధ‌గ‌ధ‌గ‌లాడిపోతోంది

By:  Tupaki Desk   |   3 March 2024 5:31 AM GMT
అంబానీ పెళ్లిలో ఎంఎస్ ధోనీతో చ‌ర‌ణ్ దాండియా
X

గుజరాత్‌లోని జామ్‌నగర్ జామ్ అయిపోయింది. సెల‌బ్రిటీ కిట‌కిట‌తో న‌గ‌రం ధ‌గ‌ధ‌గ‌లాడిపోతోంది. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక‌ల్లో సినీరాజ‌కీయ‌రంగాలు, క్రీడా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులంతా సంద‌డి చేస్తున్నారు. మూడు రోజుల ప్రీవెడ్డింగ్ లో సిత్ర‌విసిత్రాల‌న్నీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ఆస‌క్తిక‌రంగా ఈ వేడుక‌ల కోసం రాజ‌స్థాన్ జామ్ న‌గ‌ర్ లో అడుగుపెట్టిన టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి అడుగ‌డుగునా నీరాజ‌నాలు ప‌ల‌క‌డం క‌నిపిస్తోంది. భార‌త‌దేశానికి ఆస్కార్ అందించిన ఆర్.ఆర్.ఆర్ న‌టుడిగా అత‌డికి ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. ఆర్.ఆర్.ఆర్ స్టార్లు చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ అంబానీ పెళ్లి వేడుక‌లో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇంత‌కుముందే ఆ ఇద్ద‌రూ క‌లిసి విమానాశ్ర‌యానికి వెళ్లిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయ్యాయి.

ఇప్పుడు మాజీ టీమిండియా కెప్టెన్ ఎం.ఎస్.ధోనీతో చ‌ర‌ణ్ దాండియా ఆడార‌నేది ప్ర‌త్యేక వార్త‌. ఎం.ఎస్.ధోనీతో రామ్ చ‌ర‌ణ్ స్నేహం చాలా కాలంగా కొన‌సాగుతోంది. ఆ ఇద్ద‌రూ ఇంత‌కుముందు ప‌లుమార్లు ర‌క‌ర‌కాల ఈవెంట్ల‌లో క‌లుసుకున్నారు. స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇప్పుడు అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక‌ల్లోను ఈ స్నేహితుల సంద‌డి హైలైట్ గా నిలిచింది. ఎం.ఎస్.ధోనీ క్రికెట్ లో త‌న స‌హ‌చ‌రుల‌తో దాండియా ఆడుతూ ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ తో క‌లిసి దాండియా ఆడ‌టం ప్ర‌ముఖంగా అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే ధోనీతో చ‌ర‌ణ్ భేటీకి సంబంధించిన వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఇరువురూ పిచ్చా పాటీ మాట్లాడుకుంటూ వెన్యూ వ‌ద్ద సంద‌డి చేసిన వీడియోల‌ను అభిమానులు వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోల్లో చ‌ర‌ణ్ త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో పాటు క‌నిపిస్తున్నారు.

భారత మాజీ కెప్టెన్ MS ధోని భార్య సాక్షితో క‌లిసి వేదిక వ‌ద్ద‌కు విచ్చేయ‌గా, మాజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సహచరుడు డ్వేన్ బ్రావోతో కలిసి దాండియా ఆడుతున్న వీడియోలు కూడా వైర‌ల్ గా మారాయి.

అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు సినీ తారలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, ప్ర‌పంచ ప్ర‌ముఖులు జామ్‌నగర్‌కు చేరుకున్నారు. క్రికెటర్లలో ధోని - బ్రావోతో పాటు, భారత కెప్టెన్ రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్ మరియు జహీర్ ఖాన్ త‌దిత‌రులు క‌నిపించారు. ధోనీ-సాక్షి- బ్రేవో ముగ్గురూ దాండియా ఆడుతూ ఆనందిస్తున్న వీడియో హైలైట్ ల‌లో ఒక‌టి. మరొక క్లిప్‌లో ధోనీ బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్ , రణవీర్ సింగ్‌లతో కలిసి కనిపించాడు. మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్‌తో ఎం.ఎస్‌.ధోనీ వీడియో మెగాభిమానుల‌ను ఒక రేంజులో షేక్ చేస్తోంది.