Begin typing your search above and press return to search.

ధనుష్ టాలీవుడ్ ఛాయిస్.. మరో క్రేజీ కాంబో

విరాటపర్వం సినిమాతో మంచి విషయం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల మూడో చిత్రానికి రెడీ అవుతున్నారు

By:  Tupaki Desk   |   9 Aug 2023 5:03 AM GMT
ధనుష్ టాలీవుడ్ ఛాయిస్.. మరో క్రేజీ కాంబో
X

సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు ధనుష్. తమిళంలో స్టార్ హీరోగా ఉన్న ధనుష్ హాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. అలాగే హిందీలో రెండు బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. కెరియర్ ఆరంభంలో ధనుష్ ని పాయింట్ చేసినవారే ఇప్పుడు పిలిచి మరీ భారీగా రెమ్యునరేషన్ ఇస్తూ అవకాశాలు ఇచ్చే స్థాయిని అందుకున్నాడు.

తమిళంలో ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమా ధనుష్ చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీని తర్వాత స్వీయ దర్శకత్వంలోనే మరో పాన్ ఇండియా మూవీ కూడా ధనుష్ ఎనౌన్స్ చేశాడు. ఈ ఏడాది స్ట్రైట్ తెలుగు మూవీతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ అతన్ని టాలీవుడ్ లో స్టార్ గా మార్చేసింది.

ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పీరియాడిక్ జోనర్ మూవీకి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఏషియన్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. రీసెంట్ గా అఫీషియమ్ ఎనౌన్సమెంట్ ఇచ్చారు. త్వరలో ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది. ధనుష్ తో పాటు టాలీవుడ్ కి చెందిన సీనియర్ హీరో ఈ మూవీలో నటించే అవకాశం ఉందంట.

ఇక రెండో మూవీ కంప్లీట్ కాకుండానే టాలీవుడ్ మరో టాలెంటెడ్ డైరెక్టర్ కి ధనుష్ ఒకే చెప్పాడు నీది నాది ఒకటే కథ,. విరాటపర్వం సినిమాతో మంచి విషయం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వేణు ఊడుగుల మూడో చిత్రానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా కథని ధనుష్ కి చెప్పి ఫైనల్ చేసుకున్నారంట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.

త్వరలో ఈ చిత్రానికి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వేణు ఊడుగుల మూవీ అంటే కచ్చితంగా సమాజంలోనించి పుడుతుంది. ఇలాంటి రియలిస్టిక్ కథలు చేయడానికి ధనుష్ ముందుంటాడు. అందుకే వేణు చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.