Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌ కి సర్‌ప్రైజ్‌, షాక్‌ ఒకేసారి ఇచ్చిన వారసుడు!

సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదువ లేదు. స్టార్‌ హీరోల వారసుల్లో మెజార్టీ శాతం వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   5 March 2024 2:30 AM GMT
ఫ్యాన్స్‌ కి సర్‌ప్రైజ్‌, షాక్‌ ఒకేసారి ఇచ్చిన వారసుడు!
X

సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదువ లేదు. స్టార్‌ హీరోల వారసుల్లో మెజార్టీ శాతం వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్‌ హీరోల్లో వారసులే ఎక్కువ శాతం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒక స్టార్‌ హీరో తనయుడు మాత్రం హీరో అవ్వాలని అనుకోవడం లేదట.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ కి ఇద్దరు కొడుకులు. పెద్ద వాడు యాత్ర రాజా కాగా రెండో వాడు లింగ రాజా. వీరిద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో యాత్ర రాజా ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేయడంతో పాటు షాక్‌ ఇచ్చాడు.

చూడ్డానికి హీరోలా ఉన్న యాత్ర రాజా హీరోగా కాకుండా టెక్నీషియన్‌ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడట. అది కూడా దర్శకుడిగా కాదు సినిమాటోగ్రాఫర్ గా అంటూ తమిళ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. నిజంగానే ఇది పెద్ద సర్‌ప్రైజ్ మరియు షాకింగ్‌ అంటూ మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ధనుష్‌ ప్రస్తుతం రాయన్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా యొక్క కెమెరా డిపార్ట్‌మెంట్‌ లో ఈ స్టార్‌ కిడ్‌ వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. చిన్న వయసులోనే ధనుష్ తనయుడు యాత్ర సినిమాటోగ్రఫర్ గా కెరీర్‌ ను ఆరంభించడం ఆశ్చర్యంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రాయన్‌ యొక్క సినిమాటోగ్రఫీ పూర్తి బాధ్యతలను యాత్ర నిర్వహిస్తున్నాడా లేదంటే ఆ టీమ్ లో భాగం అయ్యాడా అనేది క్లారిటీ లేదు. మొత్తానికి యాత్ర సినిమాటోగ్రఫర్ గా ముందు ముందు మరిన్ని సినిమాలకు వర్క్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

ధనుష్ తనయుడు హీరోగా కాకుండా ఇలా సినిమాటోగ్రఫర్ గా మారడం ఏ మాత్రం నచ్చడం లేదు అంటూ ఫ్యాన్స్ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ముందు ముందు యాత్ర కచ్చితంగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని కొందరు విశ్వాసంతో ఉన్నారు. మరి అతడి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది చూడాలి.