Begin typing your search above and press return to search.

ధ‌నుష్ ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌యోగం?

ఇప్పుడు 2023 ముగుస్తోంది. కొత్త సంవ‌త్స‌రంలో అడుగు పెట్ట‌బోతున్నాం. ఇంత‌లోనే ధ‌నుష్ మూడవసారి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాన‌ని ప్ర‌క‌టించాడు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 3:59 AM GMT
ధ‌నుష్ ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌యోగం?
X

ఆల్ రౌండ‌ర్ నైపుణ్యంతో ట్యాలెంటెడ్ ధ‌నుష్ ప్ర‌తిసారీ ఆశ్చ‌ర్య‌పరుస్తుంటాడు. గాయ‌కుడిగా ధ‌నుష్ ఆల‌పించిన కొల‌వెరి ..డి ఎంత పాపులారిటీ తెచ్చిందో తెలిసిందే. ధ‌నుష్ లోని ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌కు కూడా మంచి గుర్తింపు ఉంది. దర్శక‌త్వంలో సత్తాను నిరూపించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ధనుష్.


ఇప్పుడు 2023 ముగుస్తోంది. కొత్త సంవ‌త్స‌రంలో అడుగు పెట్ట‌బోతున్నాం. ఇంత‌లోనే ధ‌నుష్ మూడవసారి దర్శకత్వం వహించడానికి రెడీ అవుతున్నాన‌ని ప్ర‌క‌టించాడు. తన కొత్త సినిమాని నేటిత‌రం తార‌ల‌తో చేస్తున్న‌ట్టు వెల్ల‌డించాడు. 'నిలవుక్కు ఎమ్మెల్ ఎన్నడి కోబమ్' అనే టైటిల్‌ను ఆవిష్కరించగా అది వైర‌ల్ గా మారింది. ధనుష్ ఈ సినిమా టైటిల్ ని ప్ర‌క‌టించి ఆకర్షణీయమైన 1 నిమిషాల 9 సెకన్ల మోషన్ పోస్టర్‌ను షేర్ చేసారు. ఈ చిత్రాన్ని 'సాధారణ ప్రేమకథ' అని చిత్రబృందం అభివర్ణించింది.

ధనుష్ 2017లో 'పా పాండి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తన రెండవ చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. నేటిత‌రం తో ప్రేమ‌క‌థా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ప్ర‌యోగం ఏమేర‌కు స‌త్ఫ‌లితాన్ని ఇస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, లియో ఫేమ్ మాథ్యూ థామస్, అనిఖా సురేంద్రన్, నూతన నటుడు పవేష్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ధనుష్ స్వంత బ్యానర్ అయిన వండర్‌బార్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.