Begin typing your search above and press return to search.

కమ్ముల ధనుష్.. ఎదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

లీడర్ లో ఎన్నో మంచి పాయింట్స్ తో ఆకట్టుకున్న కమ్ముల ఈసారి ఎలాంటి పాయింట్ ను టచ్ చేస్తాడో చూడాలి.

By:  Tupaki Desk   |   27 July 2023 2:59 PM GMT
కమ్ముల ధనుష్.. ఎదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు
X

తమిళ స్టార్ హీరో ధనుష్ వరస సినిమా తో దూసుకుపోతున్నారు.తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన ఆయన, ఇప్పుడు ఫోకస్ మొత్తం తెలుగు పై పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల సార్ మూవీ తో తొలిసారిగా డైరెక్ట్ గా తెలుగు సినిమా చేశారు. ఈ మూవీకి తెలుగు ఆడియన్స్ ఆయన కు ఫిదా అయిపోయారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ ఊపులోనే ఆయన మరో సినిమా ఒకే చేశారు. ఆ మూవీ ని తాజాగా అధికారికంగా ప్రకటించారు.


ధనుష్ 51వ సినిమా ను అధికారికంగా ప్రకటించారు. లెజండరీ నిర్మాత, డిస్ట్రిబ్యుటర్, ఎగ్జిబిటర్ శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ జయంతి సందర్భంగా ఈ మూవీని ప్రకటించడం విశేషం. కాగా, ఈ సినిమా లో ధనుష్ హీరోగా, మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, అధికారికంగా ఈ రోజే ప్రకటించడం విశేషం.

ఇక ఎనౌన్స్ చేసిన పోస్టర్ లో పాతకాలపు కరెన్సీ నోట్లు కనిపిస్తున్నాయి. చూస్తుంటే కమ్ముల ఈసారి కరష్షన్ కు సంబంధించిన పాయింట్ ఏదో టచ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. నోటుకు ఒకవైపు పెద్ద బిల్డింగ్ తో ఉన్న సిటీ మరోవైపు గుడిసెల ను హైలెట్ చేశారు. లీడర్ లో ఎన్నో మంచి పాయింట్స్ తో ఆకట్టుకున్న కమ్ముల ఈసారి ఎలాంటి పాయింట్ ను టచ్ చేస్తాడో చూడాలి.

ఇక, ధనుష్ పుట్టిన రోజు జులై28వ తేదీన ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మూవీ లో ఆయన లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుదని సమాచారం. ధనుష్ ఇప్పటి వరకు చేయని జోనర్ లో ఈ మూవీ సాగుతుందట. ఇక, దీని లో ధనుష్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు, ఇతర నటీనటులు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీతో బిజీ గా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ మూవీ టీజర్ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా లో ధనుష్ సరసన కోలివుడ్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటించనున్నారు. విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్‌ స్పూర్తితో ఈ మూవీ తెరకెక్కించారు. ఈ మూవీ మూడు పార్ట్స్ గా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

సత్య జ్యోతి ఫిలిమ్స్‌ తెరకెక్కిస్తున్న కెప్టెన్‌ మిల్లర్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్‌ , టాలీవుడ్ యాక్టర్ సందీప్‌ కిషన్‌, నివేదితా సతీశ్‌, అమెరికన్‌ యాక్టర్‌, ఆర్ఆర్ఆర్‌ ఫేం ఎడ్వర్డ్‌ సొన్నెన్‌బ్లిక్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.