SSMB29 కోసం ఫామ్ లో లేని మరో దర్శకుడు.. ఎందుకంటే..
అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి వారే ఈ టీమ్లో ఉన్నారని సమాచారం. ఆ మద్య కుదిరిన ఓ విశేషం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
By: Tupaki Desk | 13 April 2025 12:06 PMఇండియన్ సినిమా మొత్తం ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ అడ్వెంచర్ ఫిల్మే. ప్రపంచ స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేసేలా ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ జరుగుతోంది. RRR తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమాగా ఇది మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మహేష్ కెరీర్లో కూడా ఇది లేటెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాకు దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించబోతున్నట్టు సమాచారం. భారీ గ్రాఫిక్స్, ఇంటెన్సివ్ యాక్షన్ ఎపిసోడ్స్తో పాటు, హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నట్టు టాక్. విజువల్గా ఇండియన్ స్క్రీన్ ఎప్పుడూ చూడనంత స్థాయిలో ఉండేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ టైం నిడివి కూడా దాదాపు రెండేళ్లకు పైగానే ఉండే అవకాశం ఉంది.
స్క్రిప్ట్ వర్క్ విషయంలో రాజమౌళి చాలా క్లాస్ గా ప్లాన్ చేస్తున్నాడు. కథ ఇప్పటికే సిద్ధమై ఉంది. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ డెవలప్ మెంట్ కోసం ఆయనకు దగ్గరి రైటర్స్ టీమ్ పనిచేస్తోంది. గతంలో బాహుబలి ఫ్రాంఛైజ్ కోసం పనిచేసిన కొంతమంది, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటి వారే ఈ టీమ్లో ఉన్నారని సమాచారం. ఆ మద్య కుదిరిన ఓ విశేషం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.
అదేంటంటే, దేవా కట్టా ఈ సినిమాకు డైలాగ్స్ అందించనున్నారట. ఇది అధికారికంగా ఖరారు కాకపోయినా, అతను రాజమౌళి సన్నిహితుడిగా ఎప్పటినుంచో ఉన్నాడు. బాహుబలి OTT వెర్షన్కు కూడా అతని సహకారం ఉంది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ భారీ సినిమాకు అతని స్క్రిప్ట్ నైపుణ్యం ఉపయోగపడుతుందని భావించి ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్. మహేష్ స్టైల్కు సరిపోయేలా కంటెంట్ చక్కగా ఉండేలా రాయగలడన్న నమ్మకం ఉంది.
ఇంకా చూస్తే, దేవా కట్టా గత కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి. 'రిపబ్లిక్', 'ఆటోనగర్ సూర్య' వంటి సినిమాలు ఆలోచనాత్మక కథలున్నా, కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. డైరెక్టర్గా ఓ స్థాయిలో నిలబడతాడనే అంచనాల్ని సంతృప్తిపరచలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ప్రాజెక్ట్లో ఛాన్స్ రావడం ఆశ్చర్యం కలిగించేదే.
అయితే దేవా కట్టా విషయంలో ఒకటి మాత్రం నిస్సందేహంగా చెప్పొచ్చు. కథలో డెప్త్, డైలాగ్లు బలంగా ఉండేలా రాయగల రచయితగా అతనికి మంచి పేరుంది. ‘ప్రస్థానం’ లాంటి సినిమాతో తను కలం ఎంత పదునుగా ఉండగలదో చూపించాడు. ఇప్పుడు భారీ బడ్జెట్ ప్రాజెక్ట్లో తన టాలెంట్ మరోసారి మెరిపిస్తాడా.. మహేష్ సినిమా ద్వారా తనలోని రచనతో మళ్లీ గుర్తింపు తెచ్చుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.