Begin typing your search above and press return to search.

వెంకటేష్.. ఇప్పటివరకు ఎంత సంపాదించాడో తెలుసా?

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన ఈయన త్వరలోనే 'సైంధవ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు

By:  Tupaki Desk   |   20 Dec 2023 3:30 AM GMT
వెంకటేష్.. ఇప్పటివరకు ఎంత సంపాదించాడో తెలుసా?
X

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలతో విజయాన్నే తన ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్నారు క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని జోనర్ సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఈ ఏజ్ లోనూ యువ హీరోలకు పోటీ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు పునాది వేసింది కూడా ఈయనే.

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో మల్టీస్టారర్ సినిమాలు చేసిన ఈయన త్వరలోనే 'సైంధవ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక వెంకటేష్ వ్యక్తిగత విషయానికి వస్తే.. వెంకటేష్ నీరజ అనే మహిళను పెళ్లి చేసుకోగా వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇప్పటికే పెద్దమ్మాయికి వివాహం జరగగా రీసెంట్ గా రెండో అమ్మాయి నిశ్చితార్థం కూడా చేశారు. వెంకటేష్ కొడుకు ఉన్నత చదువులు చదువుతున్నాడు.

ఇక కెరియర్ పరంగా ఒక్కో సినిమాకి 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వెంకటేష్ ఇప్పటివరకు రూ.2000 కోట్ల ఆస్తిపాస్తులు సంపాదించారని తెలుస్తోంది. ఓవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలా హీరోగా, నిర్మాతగా వచ్చిన సంపాదనతో విలువైన ఆస్తులను కూడ పెట్టాడు. అంతేకాకుండా వెంకటేష్ కి తండ్రి మంచి వారసత్వంగా మరో వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా వచ్చినట్లు సమాచారం.

దీంతో కలుపుకొని వెంకటేష్ కి మూడు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు. టాలీవుడ్ లో అత్యధిక ఆస్తులు కలిగిన హీరోల్లో వెంకటేష్ కూడా ఒకరు. మొదటి స్థానంలో నాగర్జున ఉన్నారు. ఆయన రూ.3000 కోట్లకు పైగా ఆస్తులను పోగేసాడు. వెంకటేష్ కి ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చాలామందికి తెలియదు.

ఇక ఆయన తాజాగా నటిస్తున్న 'సైంధవ్' మూవీ విషయానికొస్తే.. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లో 75వ చిత్రం గా రూపొందుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో వెంకటేష్ ఫస్ట్ టైం పాన్ ఇండియా మార్కెట్లో అడుగుపెడుతున్నాడు. జెర్సీ మూవీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ విలన్ గా కనిపించనున్నాడు. 2024 జనవరి 13 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.