Begin typing your search above and press return to search.

తెలుగు డైరెక్ట‌ర్ల‌కు కోలీవుడ్ డైరెక్ట‌ర్ మెగా ఝ‌ల‌క్

చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్‌కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తార‌ని ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   20 May 2024 5:35 AM GMT
తెలుగు డైరెక్ట‌ర్ల‌కు కోలీవుడ్ డైరెక్ట‌ర్ మెగా ఝ‌ల‌క్
X

మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాల‌ని ఎవ‌రు కోరుకోరు? ఇప్ప‌టికే ఆయ‌న క్యూలో చాలా మంది ద‌ర్శ‌కులు ఉన్నారు. ఇందులో బోయ‌పాటి శ్రీ‌ను, అనీల్ రావిపూడి వంటి ప్ర‌ముఖుల పేర్లు కూడా ఉన్నాయి. జెర్సీ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి, మారుతి వంటి మిడ్ రేంజ్ ద‌ర్శ‌కులు కూడా చిరుకి క‌థ‌లు వినిపించార‌ని ప్ర‌చార‌మైంది. వీరంతా ఏదో ఒక రోజు చిరంజీవిని డైరెక్ట్ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నావారే.

కానీ ఇంత‌లోనే చిరుతో విశ్వంభ‌ర లాంటి ఫాంట‌సీ డ్రామాను తెర‌కెక్కించే అవ‌కాశం, అదృష్టం వ‌శిష్ఠ అనే యంగ్ ట్యాలెంట్ కి ద‌క్కింది. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేంగా పూర్త‌వుతోంది. ఇదిలా ఉండ‌గానే.. చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్‌కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తార‌ని ఫిలింన‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే ప్రీప్రొడ‌క్ష‌న్ ప్రారంభిస్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రాజాకు చాలా కాలంగా స్నేహితుడు అయిన మ‌చ్చ ర‌వి ర‌చనా విభాగంలో స‌హ‌క‌రిస్తున్నార‌ని తెలిసింది. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తార‌ని తెలుస్తోంది. దీనికోసం దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆగ‌స్టు లేదా ఏడాది చివ‌రిలో సినిమా ప్రారంభించే వీలుంద‌ని కూడా తెలుస్తోంది.

2025 సంక్రాంతి పందెంలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. జూలైలోపు టాకీ పూర్తి చేసి త‌దుపరి మోహ‌న్ రాజాతో సినిమా చేయ‌నున్నారు. అయితే మోహ‌న్ రాజా లాంటి పొరుగు భాషా ద‌ర్శ‌కుడు జాక్ పాట్ కొట్టేయ‌డంతో ఇప్పుడు బోయ‌పాటి స‌హా ఇత‌ర తెలుగు ద‌ర్శ‌కులు వెన‌క్కి వెళ్లిపోయారు. నిజానికి రామ్ చ‌ర‌ణ్ తో 'ధృవ‌' (త‌ని ఒరువ‌న్ రీమేక్ ) సినిమా చేయాల‌ని మోహ‌న్ రాజా అనుకున్నారని క‌థ‌నాలొచ్చాయి. త‌మిళంలో 'త‌ని ఒరువ‌న్' తో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న మోహ‌న్ రాజా త‌న చిత్రాన్ని తానే ధృవ పేరుతో తెలుగులో తెర‌కెక్కిస్తార‌ని కూడా ప్ర‌చార‌మైంది. కానీ ఆ చిత్రాన్ని సురేంద‌ర్ రెడ్డి తెలుగైజ్ చేసారు. ధృవ రిలీజైన త‌ర్వాత కూడా మోహ‌న్ రాజా చిరంజీవితో క‌లిసి ప‌ని చేస్తార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇప్ప‌టికి అత‌డు ఆశించిన‌ది నిజ‌మ‌వుతోంద‌న్న‌మాట‌.