Begin typing your search above and press return to search.

`జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్‌పై చిరు

1990 వ‌ర‌ద‌ల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి`కి సీక్వెల్ తెర‌కెక్కించాల‌ని వైజ‌యంతి మూవీస్ అధినేత‌, నిర్మాత అశ్వ‌నిద‌త్ చాలా ప్ర‌య‌త్నాలు చేసారు.

By:  Tupaki Desk   |   13 April 2024 4:55 AM GMT
`జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి` సీక్వెల్‌పై చిరు
X

1990 వ‌ర‌ద‌ల్లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన `జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి`కి సీక్వెల్ తెర‌కెక్కించాల‌ని వైజ‌యంతి మూవీస్ అధినేత‌, నిర్మాత అశ్వ‌నిద‌త్ చాలా ప్ర‌య‌త్నాలు చేసారు. అప్ప‌ట్లో రామ్ చ‌ర‌ణ్ - జాన్వీ క‌పూర్ జంట‌గా ఈ సీక్వెల్ ని తెర‌కెక్కిస్తాన‌ని కూడా అన్నారు. కానీ ఈ సీక్వెల్ స్క్రిప్టు రెడీ కాక‌పోవ‌డంతో అది సాధ్య‌ప‌డ‌లేదు. చాలా కాలంగా బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ సీక్వెల్ కోసం క‌థ‌ను రెడీ చేస్తున్నార‌ని కూడా ప్ర‌చార‌మైంది. కానీ ఏదీ నిజం కాలేదు.

ఇటీవ‌ల‌ బుచ్చిబాబు స‌నాతో కొత్త సినిమా లాంచ్ లో జాన్వీక‌పూర్ స‌మ‌క్షంలో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ.. జాన్వీ నేను జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్లో న‌టించాల‌ని అభిమానులంతా కోరుకుంటున్నారు. అలాంటి రోజు రావాల‌ని ఆశిస్తున్నాన‌ని రామ్ చ‌ర‌ణ్ అన్నారు. ఇప్పుడు జ‌గ‌దేక వీరుడిగా న‌టించిన మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేసారు.

తాజాగా ఓ స‌మావేశంలో చిరు మాట్లాడుతూ.. రామ్ చ‌ర‌ణ్- జాన్వీ క‌పూర్ జంట త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా జగ‌దేక వీరుడు- అతిలోక సుంద‌రి సీక్వెల్లో న‌టిస్తే చూడాల‌నుంద‌ని అన్నారు. త్వ‌ర‌లో ఆ క‌ల నెర‌వేరాలి. జాన్వీ ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తో బుచ్చిబాబు సినిమా చేస్తోంది. త‌న‌తో మాట్లాడుతుంటే శ్రీ‌దేవి గుర్తుకొచ్చి ఎమోష‌న‌ల్ అయ్యాను. ఇండ‌స్ట్రీ ఓ మంచి న‌టి (దివంగ‌త న‌టి శ్రీ‌దేవి)ని కోల్పోయింది అని చిరంజీవి అన్నారు.

చిరంజీవి- శ్రీ‌దేవి నాయ‌కానాయిక‌లుగా షాలిని, షామిలీ బాల‌న‌టీమ‌ణులుగా, అమ్రిష్ పురి విల‌న్ గా న‌టించిన జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి చిత్రానికి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రం ఫాంట‌సీ జాన‌ర్ లో మ్యూజిక‌ల్ హిట్ చిత్రంగా నిలిచింది. చాలా కాలంగా జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి లాంటి క్లాసిక్ హిట్ చిత్రానికి సీక్వెల్ తీయాలంటే ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భ‌య‌ప‌డ్డారు. అలాంటి క్లాసిక్ ని ట‌చ్ చేయ‌డం ప్ర‌మాద‌క‌రం అని భ‌య‌ప‌డుతూనే ఉన్నారు. అందుకే ఇంత‌కాలం ఈ సినిమాకి సీక్వెల్ రాలేదు. కానీ తాజా ప‌రిణామం చూస్తుంటే రామ్ చ‌ర‌ణ్ - జాన్వీ క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ సినిమా సీక్వెల్ తెర‌కెక్కేందుకు ఆస్కారం ఉంది.