Begin typing your search above and press return to search.

తమ్ముడిని కొట్టి తండ్రి దగ్గర బాధపడ్డ చిరు.. ఎందుకంటే..?

తమకు సెలబ్రిటీస్ అనిపించే కొందరి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు వారి అభిమానులను సర్ ప్రైజ్ చేస్తాయి

By:  Tupaki Desk   |   2 April 2024 12:58 PM GMT
తమ్ముడిని కొట్టి తండ్రి దగ్గర బాధపడ్డ చిరు.. ఎందుకంటే..?
X

తమకు సెలబ్రిటీస్ అనిపించే కొందరి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలు వారి అభిమానులను సర్ ప్రైజ్ చేస్తాయి. లేటెస్ట్ గా చిరంజీవి తన జీవితంలో జరిగిన విషయాల గురించి రీసెంట్ గా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నాగ బాబు పై ఎప్పుడైనా చేయి చేసుకున్నారా అన్న ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు సమాధానంగా అవునని ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఇంటర్మీడియెట్ చదువుతున్న టైం లో నాగబాబు 6, 7 తరగతిలో ఉన్నాడు. అమ్మ తనకు ఆల్రెడీ ఒక పని చెప్పగా ఆ టైం లోనే లాండ్రీ కి వెళ్లి బట్టలు తెమ్మని చెప్పింది.

అయితే తనకు వేరే పని ఉండటం వల్ల తమ్ముడు నాగ బాబుకి లాండ్రీ కి వెళ్లి బట్టలు తెమ్మని చెప్పి వెళ్లాను. తన పని ముగించుకుని వచ్చాక నాగ బాబుని లాండ్రీకి వెళ్లావా అని అడిగితే లేదు నిద్రపోయానని సమాధానం ఇచ్చాడు. ఆ టైం లో తనకు బాగా కోపం వచ్చి నాగ బాబు మీద చేయి చేసుకున్నానని చెప్పారు చిరంజీవి. అయితే చిన్నపిల్లాడిని ఎందుకు కొట్టావని అమ్మ మందలించిందని.. ఆ తర్వాత నాన్న వస్తే ఆయన దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి బాధపడ్డానని అన్నారు చిరంజీవి.

మెగా బ్రదర్ నాగ బాబు నటుడిగా ప్రయత్నాలు చేశాడు. ఒకటి రెండు లీడ్ రోల్స్ లో కూడా సినిమాలు చేశారు. కానీ ఆయన హీరోగా క్లిక్ అవ్వలేదు. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన నాగ బాబు నిర్మాతగా కొన్నాళ్లు సినిమాలు చేశారు. బుల్లితెరలో జబర్దస్త్ జడ్జిగా నాగ బాబు కొన్నాళ్లు సందడి చేశారు. ఇప్పటికీ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు.

చిరంజీవితో కలిసి చాలా సినిమాల్లో నటించిన నాగ బాబు అన్నయ్యకు ప్రియ తమ్ముడిగా ఉంటూ వచ్చారు. మెగా బ్రదర్స్ లో కాస్త బోల్డ్ గా ఉండేది ఎవరంటే అది నాగ బాబు మాత్రమే. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా కామెంట్ చేస్తే నాగ బాబు దానికి సమాధానం ఇస్తూ వస్తాడు. ఇక చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్న మెగాస్టార్ ఈ సినిమాను అనుకున్న టైం కి పూర్తి చేయాలని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. విశ్వంభర సినిమా 2025 జనవరి 10 రిలీజ్ ప్లాన్ చేశారు. చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కూడా మరో కథానాయికగా కనిపిస్తుందని తెలుస్తుంది.