నిజమే.. రెండు వారాల గ్యాప్ లో చిరు, రవితేజ!
అయితే అవే డేట్స్ కన్ఫర్మ్ అయితే.. రెండు వారాల గ్యాప్ లో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అవుతుంది.
By: Tupaki Desk | 9 May 2025 8:47 PM ISTమెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. చిరంజీవి ఇప్పటికే విశ్వంభర మూవీ పూర్తిచేసి అనిల్ రావిపూడి సినిమా పనుల్లో మునిగిపోయారు. అదే సమయంలో రవితేజ.. మాస్ జాతర సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే అటు విశ్వంభర.. ఇటు మాస్ జాతర సినిమాల రిలీజ్ లపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. నిజానికి ఆ రెండు సినిమాలు.. సంక్రాంతి పండుగ స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల రెండు చిత్రాలు వాయిదా పడ్డాయి. ఇంకా ఆయా మేకర్స్.. కొత్త రిలీజ్ తేదీలను ప్రకటించలేదు.
టాలీవుడ్ లక్కీ డేట్ అయిన నేడు(మే 9) విశ్వంభర సినిమా రిలీజ్ అవుతుందని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ మేకర్స్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత మాస్ జాతరను నేడే రిలీజ్ చేస్తామని కొంత కాలం క్రితం మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో తెలియదు.. మళ్లీ విడుదల వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పుడు విశ్వంభర, మాస్ జాతర సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయా మూవీల మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని టాక్. జూలై 11వ తేదీన మాస్ జాతర.. జూలై 24వ తేదీన విశ్వంభర ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కచ్చితంగా ఆ డేట్స్ కే వస్తాయని సమాచారం.
అయితే అవే డేట్స్ కన్ఫర్మ్ అయితే.. రెండు వారాల గ్యాప్ లో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అవుతుంది. అలా జరిగితే ఏదో ఒక సినిమా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం కచ్చితంగా ఉంటుంది. కానీ మేకర్స్ మాత్రం ఆ రెండు తేదీలనే ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
కాగా, విశ్వంభరకు వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరోవైపు, మాస్ జాతర మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య రూపొందిస్తున్నారు. మరి ఆ రెండు సినిమాలు ఎలాంటి హిట్ అవుతాయో వేచి చూడాలి.