Begin typing your search above and press return to search.

అతను మరో రాజమౌళి.. అల్లు అరవింద్ బ్రాండ్ వేశారంటే..!

యానిమేషన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది.

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:51 AM GMT
అతను మరో రాజమౌళి.. అల్లు అరవింద్ బ్రాండ్ వేశారంటే..!
X

యానిమేషన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న గ్రీన్ గోల్డ్ గ్రూప్ ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతుంది. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ బ్యానర్ లోగోను మెగా నిర్మాత అల్లు అరవింద్, శరత్ మరార్ రిలీజ్ చేశారు. రెండు దశాబ్దాలుగా గ్రీన్ గోల్డ్ గ్రూప్ నుంచి కార్టూన్ నెట్వర్క్, డిస్నీ ఎక్స్ డీలో బ్యాంగ్ విక్రం బేతాల్, చోటా భీం, ది కృష్ణ లాంటి ప్రోగ్రామ్స్ తో మెప్పించారు.


2010 నుంచి బిజినెస్ విస్తరించిన వీరు అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ మాధ్యమాలకు వెబ్ సీరీస్ లను కూడా రూపొందించారు. రెండేళ్ల క్రితం గ్రీన్ గోల్డ్ వి.ఎఫ్.ఎక్స్ సంస్థను స్థాపించి గాడ్ బంగార్రాజు, దసరా, గాడ్ ఫాదర్, చార్లి వంటి సినిమాలకు పనిచేసి ప్రశంసలు అందుకున్నారు. లాస్ట్ ఇయర్ గ్రీన్ గోల్డ్ స్టూడియోస్ సంస్థను స్థాపించారు. చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో లాంచింగ్ సందర్భంగా ఈవెంట్ లో నిర్మాత రాజీవ్ చిలక, అల్లు అరవింద్, శరత్ కుమార్, శ్రీనివాస్ చిలక తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజీవ్ చిలక మాట్లాడుతూ.. లయన్ కింగ్ సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమాను ఇండియాలో ఎందుకు తీయకూడదు అనిపించింది. వరల్డ్ డిస్నీ నాకు ఎప్పుడూ ఓ ఇన్‌స్పిరేషన్. నేను యానిమేషన్ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ఇబ్బందులుండేవి. వాటన్నింటినీ అధిగమిస్తూ సిన్సియర్‌గా కష్టపడుతూ వచ్చామని అన్నారు రాజీవ్ చిలక. లయన్ కింగ్ లాంటి సినిమా చేయాలనే గోల్ తోనే గ్రీన్ గోల్డ్ సంస్థ స్టార్ట్ చేశాం. నాకంటే ముందు నాకు తెలిసిన స్నేహితులు చాలా మంది సినీ ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వలేక ఇంటికెళ్లిపోయారు. వీటన్నింటినీ గమనిస్తూ ముందుకు వెళ్లాను. అందుకే నాకు ఇరవై ఏళ్లు పట్టింది. ప్రస్తుతానికి రెండు తెలుగు సినిమాలు, హిందీలో ఓ చిన్న పిల్లల చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నామని అన్నారు రాజీవ్. ఇవే కాకుండా ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో అరవింద్ గారిలా కావాలని అనుకుంటున్నాను అందరూ మా బ్యానర్‌కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు రాజీవ్ చిలక.


శ్రీనివాస్ చిలక మాట్లాడుతూ సీనియర్ నటులు సి.ఎస్.ఆర్.ఆంజనేయులు గారు మా పెద్ద తాత అవుతారు. నాటక రంగంలోకి తనదైన గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి ఆయన. తాత గారు నాగేశ్వరరావు గారు వాహిని స్టూడియోలో అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. గుణ సుందరి కథ, మల్లీశ్వరి, మాయాబజార్ వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు వర్క్ చేశారని అన్నారు. మా నాన్నగారు మధుసూదన్ డి.ఆర్.డి.ఓ లో వర్క్ చేశారు. ఇంనీరింగ్ చదువుకుని, యు.ఎస్‌లో సెటిలయ్యాం. ఓరోజు రాజీవ్ నాకు ఫోన్ చేసి జాబ్ వదిలేస్తున్నానని అన్నాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో యానిమేషన్ నేర్చుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. గ్రీన్ గోల్డ్ సంస్థను స్టార్ట్ చేశాం. 2004లో కృష్ణ యానిమేషన్ సిరీస్‌ను స్టార్ట్ చేశాం. 2008లో చోటా భీమ్ స్టార్ట్ చేశాం. ఇండియన్ యానిమేషన్‌కే చోటా భీమ్ దారి చూపించింది. ఇప్పటికి 15 ఏళ్లు అవుతున్నా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. 2012లో చోటా భీమ్‌ను థియేటర్‌లో రిలీజ్ చేశాం. టీవీ, థియేటర్లో రాజీవ్ డైరెక్ట్ చేస్తూ 116 యానిమేషన్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. ఈ జర్నీలో భాగంగా చిలకా ప్రొడక్షన్స్ స్టార్ట్ చేశామని అన్నారు.


నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలోకి చిలకా ప్రొడక్షన్స్ ద్వారా అడుగు పెడుతున్న శ్రీనివాస్ చిలకలపూడి, రాజీవ్ చిలకలపూడిలకు అభినందనలు చెప్పారు. చోటా భీమ్, కృష్ణ సిరీస్ వంటి వాటితో యానిమేషన్ రంగంలో గ్రీన్ గోల్డ్ సంస్థ ఓ మార్క్ క్రియేట్ చేసింది. రాజీవ్ చాలా ఏళ్లుగా నాకు తెలుసు. తనలో మంచి లీడర్‌షిప్, క్రియేటివిటీ ఉందని అన్నారు. అరవింద్ గారి వంటి నిర్మాత చేతుల మీదుగా ఈ బ్యానర్ స్టార్ట్ కావటం ఆనందంగా ఉంది. గ్రీన్ గోల్డ్ బ్యానర్ నుంచి మంచి సినిమాలు వస్తుందని నేను భావిస్తున్నానని అన్నారు శరత్ మరార్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇలాంటి కొత్త ప్రయోగం చేసే మనుషులను, బ్యానర్స్ ను పరిచయం చేయటం ఆనందంగా ఉందని అన్నారు. 2011 రాజీవ్ నన్ను కలిశాడు. 70 ఏళ్ల ముందు మా నాన్నగారు సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనే కోరికతో పెట్టె సర్దుకుని అమ్మని ఊళ్లోని వదిలేసి మద్రాస్ వచ్చేశాడు. ఆ ప్యాషనే ఈరోజు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. దాన్ని ప్యాషన్ అనో, పిచ్చి అనో అనుకున్నా పర్లేదు. అలాంటి పిచ్చి ఉన్న రాజీవ్ ను అంటే నాకు తెలియని ప్రేమ, అభిమానమని అన్నారు. రాజీవ్ చేసిన చోటా భీమ్‌ని నేను తెలుగులో రిలీజ్ చేశాను. తర్వాత ఓరోజు పంజాగుట్టలో చూస్తే బెలూన్స్ పై కూడా చోటా భీమ్ బొమ్మలు చూసి ఎంత పాపులర్ అయ్యిందోనని ఆశ్చర్యపోయాను. రాజీవ్ చిన్నగా స్టార్ట్ చేసిన చోటా భీమ్ చాలా పాపులర్ అయ్యింది. తను సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. అతిశయోక్తి అనుకోకపోతే రాజీవ్‌ను రాజమౌళితో పోల్చవచ్చు. ఎందుకంటే ఆయన దగ్గరున్న ఫ్యాషన్‌ని.. రాజీవ్ దగ్గర కూడా చూశాను. చిలకా ప్రొడక్షన్స్ ఎన్నో మంచి చిత్రాలను సాధించాలని అభినందనలు తెలియచేశారు అల్లు అరవింద్.