Begin typing your search above and press return to search.

చరణ్ - మహేష్.. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే..

బయట ఎక్కడ కలిసినా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే ఈ ఇద్దరు వెండితెరపై కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా కోరుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 12:38 PM GMT
చరణ్ - మహేష్.. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే..
X

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు పలువురు హాజరయ్యారు. ఇక ఈ సెలబ్రేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ప్రత్యేకంగా పాల్గొన్నారు. మహేష్ బాబు రామ్ చరణ్ ఇద్దరూ కూడా మంచి మిత్రులు అని అందరికీ తెలిసిన విషయమే. బయట ఎక్కడ కలిసినా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకునే ఈ ఇద్దరు వెండితెరపై కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా కోరుకుంటున్నారు.


ఇక ఇటీవల మెగాస్టార్ ఇంటికి వెళ్ళిన మహేష్ బాబు అక్కడ రామ్ చరణ్ తో కొన్ని ప్రత్యేకమైన ఫోటోలకు కూడా స్టిల్స్ ఇచ్చాడు. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం మాత్రం ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ ఇద్దరు హీరోలు ఎంత స్నేహంగా ఉంటారో ఒక రెండు ఫోటోల ద్వారా చాలా క్లియర్ గా అర్థమవుతుంది.

మెగాస్టార్ ఇంట్లో రామ్ చరణ్ ఎప్పుడు వేసుకునే చెప్పులు మహేష్ బాబు తొడుక్కోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని స్నాప్‌షాట్‌లలో, సూపర్ స్టార్ మహేష్ స్టైలిష్ బ్లాక్ డిజైనర్ షూలను ధరించి, బోల్డ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ను ప్రదర్శిస్తూ కనిపించాడు. ఇంతలో, రామ్ చరణ్ బ్రాండెడ్ స్లైడ్‌లను ధరించి మరింత సాధారణ లుక్ లో కనిపించాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వేరే ఫొటోలతో, దీపావళి పార్టీ కోసం చరణ్ రెసిడెన్సీకి వెళ్లిన తర్వాత మహేష్ చరణ్ స్లైడ్‌స్ వేసుకొని కనిపించాడు. ఈ స్లైడ్స్ మార్పిడి తో ఇద్దరు తారల మధ్య బలమైన స్నేహం గురించి ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఇక స్టార్ హీరోల సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక మరోవైపు రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా కొత్త సినిమాను మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు కూడా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా రాబోతోంది. భవిష్యత్తులో రామ్ చరణ్ సుకుమార్ తో కూడా ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.