Begin typing your search above and press return to search.

ఈ ముగ్గురు కలిస్తే.. ఎదో గట్టి ప్లానే..

ఇదిలా ఉంటే ఈ మూవీ అఫీషియల్ ప్రకటన కోసం అక్కినేని అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు

By:  Tupaki Desk   |   3 Aug 2023 5:37 AM GMT
ఈ ముగ్గురు కలిస్తే.. ఎదో గట్టి ప్లానే..
X

కస్టడీ సినిమా తర్వాత నాగ చైతన్య నెక్స్ట్ మూవీపైన ఉందనే విషయం తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మించనుంది. ఇప్పటికే కథ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకంగా 60 కోట్ల వరకు బడ్జెట్ ని ఈ సినిమా కోసం వెచ్చించడానికి నిర్మాత అల్లు అరవింద్ సిద్ధంగా ఉన్నారంట.

ఇదిలా ఉంటే ఈ మూవీ అఫీషియల్ ప్రకటన కోసం అక్కినేని అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అరవింద్ ఇచ్చిన క్లారిటీ తప్ప ఇప్పటి వరకు ఎలాంటి నెక్స్ట్ అప్డేట్ లేదని చెప్పాలి. కానీ తాజాగా చందూ మొండేటి, నాగ చైతన్య నోవొటెల్ లో టెర్రస్ లో నిలబడి మాట్లాడుతున్న ఫోటో ఒకటి బయటకొచ్చింది. ఈ ఫోటోలో నిర్మాత బన్నీ వాస్ కూడా ఉండటం విశేషం.

దీనిని బట్టి పాన్ ఇండియా సినిమా కోసమే చర్చలు జరుగుతున్నాయని అందరూ భావిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన అప్డేట్ వస్తుందని ఈ ఫోటోతో క్లారిటీ వచ్చినట్లు అనుకుంటున్నారు. పీరియాడికల్ జోనర్ లో కోస్టల్ ప్రాంతంలో జరిగే రియలిస్టిక్ స్టోరీతో ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై సినిమాటిక్ లిబర్టీతో ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నారు.

కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా లెవల్ లో చందూ మొండేటి పేరు వినబడింది. ఇప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్ ని చైతూతో చేయబోయే సినిమా కోసం రెండు చేతుల ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. అల్లు అరవింద్ కూడా కథకి చందూ మొండేటి అయితే కరెక్ట్ గా ఉంటుందని అతనిని ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వెళుతున్న నాగ చైతన్య డిఫరెంట్ కంటెంట్ తో వెళుతున్నాడు. ప్రతి సినిమాలో ఎదో కొత్త తరహా పాయింట్ ను టచ్ చేస్తున్నాడు. కచ్చితంగా నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ పాన్ ఇండియా లెవల్ లో చందూ మొండేటి ఎంత వరకు చైతన్యకి ఇస్తాడనేది వేచి చూడాలి.