Begin typing your search above and press return to search.

కెప్టెన్ మిల్ల‌ర్ కూల్ ఫోజ్ అదిరెను

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టిస్తూ యూనిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు

By:  Tupaki Desk   |   14 Dec 2023 3:57 AM GMT
కెప్టెన్ మిల్ల‌ర్ కూల్ ఫోజ్ అదిరెను
X

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టిస్తూ యూనిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధ‌నుష్‌ నటించిన 'కెప్టెన్ మిల్లర్' చిత్రం 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదల తేదీకి కేవలం నెల రోజులు మాత్రమే ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్ర‌చారంలోను వేగం పెంచేందుకు టీమ్ స‌న్నాహ‌కాల్లో ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రేసీ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్టు ధనుష్ స్వయంగా తెలియజేశాడు.

ఈ చిత్రం నుండి తన స్టైలిష్ చిత్రాన్ని ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ధనుష్ ''కెప్టెన్ మిల్లర్ .. ట్రైలర్ త్వరలో.. పొంగల్ విడుదల'' అని రాశారు. ట్రైఅంప్ బైక్ పై ధ‌నుష్ ఇలా స్టైలిష్ గా ఫోజులివ్వ‌గా యువ‌త‌రంలోకి ఈ ఫోటోగ్రాఫ్ దూసుకెళుతోంది. ఒక సామాన్యుడు రెబల్‌గా ఎలా మారాడన్నదే సినిమా. గ్రే షేడ్స్ ఉన్న ఒక యువ‌కుడు వివిధ దశలలో తీసుకున్న‌ నిర్ణయాలు అతడిని ఎక్కడికి తీసుకెళతాయన్న‌దే ఈ సినిమా కథ. ఈ చిత్రంలో సందీప్ కిషన్, శివరాజ్‌కుమార్, నివేదిత సతీష్, జాన్ కొక్కెన్, మూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా డాక్టర్ ఫేం ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

క‌మ్ముల‌తో సినిమా ఎప్పుడు?

తమిళ చిత్రసీమలోని మల్టీటాలెంటెడ్ స్టార్ గా ధ‌నుష్ ప‌నిత‌నం గురించి తెలిసిందే. అతడు న‌టుడిగానే కాదు.. అనేక రంగాలలో తన నైపుణ్యాలను నిరూపించుకున్నాడు. తమిళంలో చాలా పాటలు పాడిన ధనుష్ ఇటీవ‌ల మ‌రో పాట పాడాడు. 'నన్బన్ ఒరువన్ వంత పిరగు' సినిమా కోసం ఈ పాట‌ను పాడాడు.

ఇది టైటిల్ కి త‌గ్గ‌ట్టుగానే స్నేహ గీతం. ఈ చిత్రానికి అనంత్ రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ పాట లాంచ్ కార్య‌క్ర‌మంలో ధనుష్ తాజా చిత్రం D50 లుక్‌లో కనిపించాడు. అతడి రూపం హెయిర్ క‌ట్ ఆస‌క్తిని క‌లిగించాయి. అలాగే ధ‌నుష్ త‌దుప‌రి టాలీవుడ్ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల సార‌థ్యంలో ఓ భారీ చిత్రం(డి 51)లో న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని 2023 జూలైలో ప్ర‌క‌టించారు. 2024 ఫిబ్ర‌వ‌రి నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని తెలిసింది. రాంజానా ద‌ర్శ‌కుడు ఆనంద్ ఎల్.రాయ్ తో తేరే ఇష్క్ మే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.