Begin typing your search above and press return to search.

బన్నీ పింక్ గోరు.. కథేంటి?

అయితే, ఎడమ చేతికి పింక్ కలర్ గోరు ఫోకస్ పెట్టడం విశేషం. ఇప్పుడు చర్చ అంతా ఆ గోరుపై నే జరుగుతోంది.

By:  Tupaki Desk   |   12 Sep 2023 5:07 AM GMT
బన్నీ పింక్ గోరు.. కథేంటి?
X

ప్రపంచవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న చిత్రం పుష్ప ది రూల్. మొదటి భాగం పుష్ప బాక్సాఫీసును షేక్ చేసింది. అన్ని భాషల్లోనూ ఈ మూవీ కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బన్నీ కి ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇక, ఈ సినిమాతో అల్లు అర్జున్ కి ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది.


ఇక, రెండో భాగం వచ్చే ఏడాది సమ్మర్ లో ఉగాది పండగ సందర్భంగా వస్తుంది అని అనుకున్నారు. కానీ, తాజాగా మూవీ టీం సరికొత్త తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది అంటే 2024లో ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, ఈ డేట్ ని ప్రకటించే సమయంలో ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. దీనిలో అల్లు అర్జున్ సరికొత్తగా కనపడుతున్నారు. రెండు చేతులను మాత్రమే హైలెట్ చేశారు.

రెండు చేతులకు ఉంగరాలు, బ్రెస్ లెట్ లు ఉన్నాయి. అయితే, ఎడమ చేతికి పింక్ కలర్ గోరు ఫోకస్ పెట్టడం విశేషం. ఇప్పుడు చర్చ అంతా ఆ గోరుపై నే జరుగుతోంది. గోరు కి పింక్ కలర్ నెయిల్ పాలిష్ వేయడంతో పాటు, చిటికెన వేలు చాలా పొడవుగా కూడా ఉండటం విశేషం. అలా గోరు ఎందుకు పొడవుగా ఎందుకు చూపించారు అనే ఆసక్తి పెరిగింది. అలా గోరు పెరిగే సంస్కృతి ఏదైనా ఉందా అనే చర్చ మొదలైంది. గతంలో విడుదలైన టీజర్ లోనూ ఈ పింక్ కలర్ గోరును హైలెట్ చేశారు. ఈ విషయం తెలియాలి అంటే, సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

ఇక, ఈ మూవీ కథ పై కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. పుష్ప చైనా, జపాన్, మలేషియా లాంటి దేశాలకు పారిపోయాడా అనే అనుమానాలు కూడా వ్యక్తపరుస్తారు. పుష్ప మొదటి భాగంలో ఇంట్రడక్షన్ లోనే చైనా, జపాన్ ప్రస్తావన తీసుకు వచ్చారు. స్మగ్లింగ్ చేసిన ఎర్ర చందనం తరలించేది ఆ దేశాలకే. కాబట్టి, అక్కడకు పుష్ప పారిపోతాడు అనే చర్చ జరుగుతుంది. ఇక, టైటిల్ చూస్తుంటే కూడా ఇవే సందేహాలు కలుగుతున్నాయి. పుష్ప 2 టైటిల్ లోగో గమనిస్తే.. అందులో గ్రీన్ కలర్ లో డ్రాగన్ తరహా డిజైన్ కనిపిస్తుంది. డ్రాగన్ అంటే చైనా అని హింట్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉండగా, ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. ఫహద్ ఫాసిల్ విలన్ రోల్ పోషిస్తున్నారు. అనసూయ, సునీల్ లాంటివారు కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.