Begin typing your search above and press return to search.

ఆ ఆస్తులు అమ్మకానికి పెట్టిన శ్రీదేవి భర్త బోనీ కపూర్?

సినీ పరిశ్రమలో అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 Dec 2023 2:45 AM GMT
ఆ ఆస్తులు అమ్మకానికి పెట్టిన శ్రీదేవి భర్త బోనీ కపూర్?
X

సినీ పరిశ్రమలో అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న దివంగత నటి శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా అభిమానుల హృదయాల్లో తన సినిమాల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు. ఇక శ్రీదేవి పేరు నిలబెట్టేందుకు ఆమె కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా త్వరలోనే తెలుగు వెండితెరకి పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ కి జోడిగా 'దేవర' సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉంటే శ్రీదేవి భర్త బాలీవుడ్ సినీ నిర్మాత బోనికపూర్ ఆయన కూతుళ్లు జాన్వి, ఖుషి ముంబైలోని అందేరిలో ఉన్న నాలుగు ఫ్లాట్లను విక్రయించినట్లు తాజా సమాచారం అందుతుంది. నవంబర్ రెండవ తేదీన ఇందుకు సంబంధించి ఓ ఒప్పందం కూడా చేసుకున్నారని తెలుస్తోంది. మొత్తం రూ.12 కోట్ల రూపాయలకు అటు ఇటుగా ఈ డీల్ జరిగినట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

కాగా బోనీకపూర్ అమ్మకానికి పెట్టిన నాలుగు ఫ్లాట్స్ జాయింట్ ఆస్తులు కావడంతో వాటిని అమ్మేశారని ఉమ్మడి ఆస్తులు ఉండకూడదనే కారణం తోనే బోని కపూర్ ఈ ఆస్తులను అమ్మినట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఆస్తులను అమ్మేసినా కూడా త్వరలో జాన్వీ కపూర్ ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం జాన్వీ కపూర్ వరుస సినిమా ఆఫర్స్ తో బిజీగా ఉంది. ఓ సినిమాకు ఐదు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ఇప్పటివరకు బాలీవుడ్లో ఈమె నటించిన సినిమాలు కమర్షియల్ గా భారీ స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈసారి దేవరతో జాన్వి కెరీర్ కు బిగ్గెస్ట్ హిట్ దక్కే ఛాన్స్ అయితే ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జాహ్నవి కపూర్ కి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్స్ వస్తున్నాయి. సినిమాలతో పాటు యాడ్స్ ఫోటోషూట్స్ ద్వారా బాగానే సంపాదిస్తుంది.

ఇక సోషల్ మీడియాలోనూ ఈ బాలీవుడ్ బ్యూటీ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక జాన్వి కపూర్ ఎన్టీఆర్ తో నటిస్తున్న 'దేవర' మూవీ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది