Begin typing your search above and press return to search.

సందీప్ వంగా... బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది..

దాంతో సందీప్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా అంత వైరల్ అవ్వగా ఇప్పుడు అతని సోదరుడు, యానిమల్ నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ రెడ్డి వంగా బాలీవుడ్ క్రిటిక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:30 PM GMT
సందీప్ వంగా... బాలీవుడ్ తట్టుకోలేకపోతోంది..
X

అర్జున్ రెడ్డి మూవీతో డెబ్యూ డైరెక్టర్ గా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డివంగా అదే సినిమాని 'కబీర్ సింగ' పేరుతో బాలీవుడ్ లో చిత్రీకరించి అక్కడ కూడా అందరి దృష్టిని తన వైపు తిప్పుకొని తన స్టామినా ఏంటో నిరూపించాడు. ఇక ఇప్పుడు 'యానిమల్' మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్ గా రూ.860 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకొని ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యంత కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. రణ్బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్స్ కొందరు విమర్శలు చేసిన విషయం తెలిసిందే ఇదే విషయంపై రీసెంట్గా ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ..

బాలీవుడ్ లో ఓ సినీ క్రిటిక్స్ టీం ఉందని, వాళ్ళు కేవలం ఒకే రకమైన సినిమాలను ఇష్టపడతారని, మిగతా సినిమాలకు బ్యాడ్ రివ్యూస్ ఇస్తుంటారని, అర్జున్ రెడ్డి విషయంలోనూ అదే జరిగిందని అన్నాడు. దాంతో సందీప్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా అంత వైరల్ అవ్వగా ఇప్పుడు అతని సోదరుడు, యానిమల్ నిర్మాతల్లో ఒకరైన ప్రణయ్ రెడ్డి వంగా బాలీవుడ్ క్రిటిక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ మీడియా తన సోదరుడు సందీప్ రెడ్డి విజయాలను అసలు జీర్ణించుకోలేకపోతుందని అన్నాడు.

"కబీర్ సింగ్ సినిమా నుండి బాలీవుడ్ లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ప్రతినిధులు గ్రూపుగా ఫామ్ అయ్యి, మా బ్రదర్ ని టార్గెట్ చేశారు. సందీప్ సినిమాలు విజయాలు సాధిస్తున్న గాని వాళ్లు ఒక దక్షిణాది నుండి వచ్చిన కుర్రోడు, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ రకంగా విజయాలతో వెళ్లడం వాళ్లకు నచ్చటం లేదు. ఈ క్రమంలో రకరకాల నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటిని మేం పెద్దగా పట్టించుకోము. తెలుగులో అటువంటి మీడియా గోల ఎక్కడా లేదు.

కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే బాగా టార్గెట్ చేశారు. బాలీవుడ్ మీడియా రంగంలో మాకు టీ సిరీస్ తో పాటూ ఇంకా చాలా మంది సపోర్ట్ చేస్తున్నా కొంతమంది మాత్రం.. మా బ్రదర్ విజయవంతంగా రాణించటం తట్టుకోలేకపోతున్నారు" అంటూ చెప్పుకొచ్చాడు. ప్రణయ్ రెడ్డి వంగ దీంతో ఈయన చేసిన కామెంట్స్ మరోసారి సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతున్నాయి.