Begin typing your search above and press return to search.

సెల‌బ్రిటీల‌తో అయోధ్య రంగుల మ‌యం!

అయోధ్య రామ‌మందిరం ప్రారంభోత్స‌వానికి భారీ ఎత్తున సెల‌బ్రిటీలు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jan 2024 6:43 AM GMT
సెల‌బ్రిటీల‌తో అయోధ్య రంగుల మ‌యం!
X

అయోధ్య రామ‌మందిరం ప్రారంభోత్స‌వానికి భారీ ఎత్తున సెల‌బ్రిటీలు హాజ‌ర‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి...ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. సురేఖ‌లు ప్ర‌త్యేక విమానంలో ఆయోధ్య‌కి చేరుకున్నారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కి ఆహ్వానం అందిన అనివార్య కార‌ణాతో వెళ్ల‌లేక‌పోతున్న‌ట్లు తెలిపారు. ఇక బాలీవుడ్ నుంచి కూడా పెద్ద ఎత్తున సెల‌బ్రిటీలు హాజ‌రవుతున్న‌ట్లు తెలుస్తోంది.

అక్క‌డ చాలా మంది సెల‌బ్రిటీల‌కు రామ‌మందిరం ట్ర‌స్ట్ త‌రుపున ప్ర‌త్యేక ఆహ్వాన ప‌త్రిక‌లు అందాయి. వారిలో ప్రాణ ప్ర‌తిష్ట‌కు హాజ‌రైన సెల‌బ్రిటీలు ఎవ‌రెవ‌రు? అంటే సీనియ‌ర్ న‌టులు జాకీ ష్రాప్.. మాధురీ దీక్షిత్ నానే.. విక్కీ కౌశల్.. కత్రినా కైఫ్.. ఆయుష్మాన్ ఖురానా.. రణబీర్ కపూర్.. అలియా భట్ ద‌ర్శ‌క నిర్మాతలు రాజ్‌కుమార్ హిరానీ.. మహావీర్ జైన్ .. రోహిత్ శెట్టి రామ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు వెళ్లారు.

వీరంతా ప్ర‌త్యేక విమానంలో అక్క‌డికి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులో వీరంతా క‌లిసి దిగిన ఓ గ్రూప్ ఫోటో ఒక‌టి నెట్టింట చ‌క్కర్లు కొడుతుంది. దైవ కార్య‌క్ర‌మం కోసం అంద‌రూ ఎంతో ప్ర‌త్యేకంగా ముస్తాబ‌య్యారు. చాలా మంది మెడ‌లో సాలువా కామ‌న్ గా క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ప్రాణ ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మంలో ఇంకా చాలా మంది ప్ర‌ముఖులు..రాజకీయ‌..పారిశ్రామిక వేత్త‌లు పాల్గొన్నారు.

భారీ ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌వుతున్నారు. ఇలా అంద‌రి స‌మ‌క్షంలో ఎంతో వైభ‌వంగా ప్రారంభోత్స‌వం జ‌రుగుతుంది. అంత‌కు ముందు రామమందిరాన్ని స్వ‌యంగా దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శుభ్రం చేస్తూ క‌నిపించిన వీడియో ఎంత వైర‌ల్ అయిందో తెలిసిందే. అటుపై మోదీ వేలోనే బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కూడా శుభ్రం చేస్తూ క‌నిపించింది. ఆ వీడియో కూడా నెట్టింట అంతే వైర‌ల్ అయింది.