Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : కామన్ మ్యాన్ కే పట్టం కట్టారు..!

ఇక ఆదివారం జరిగే ఫైనల్ ఎపిసోడ్ లో టైటిల్ విజేతని అనౌన్స్ చేయనున్నారు. గత వారం నుంచి విజేత కోసం ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ లైన్స్ అందుబాటులో ఉన్నాయి.

By:  Tupaki Desk   |   16 Dec 2023 4:56 PM GMT
బిగ్ బాస్ 7 : కామన్ మ్యాన్ కే పట్టం కట్టారు..!
X

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా 15 వారాలు పూర్తి చేసుకుంది. మొదట్లో 14 మంది కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించిన బిగ్ బాస్ నిర్వాహకులు. ఐదు వారాల తర్వాత మరో ఐదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి పంపించారు. లాస్ట్ వీక్ శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వగా టాప్ 6 గా అర్జున్ అంబటి, ప్రియాంక, యావర్, శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లు నిలిచారు.

ఇక ఆదివారం జరిగే ఫైనల్ ఎపిసోడ్ లో టైటిల్ విజేతని అనౌన్స్ చేయనున్నారు. గత వారం నుంచి విజేత కోసం ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ లైన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచినట్టు తెలుస్తుంది. కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 లో ఒక్కో మెట్టు ఎక్కుతూ టైటిల్ విజేతగా నిలిచాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు హౌస్ మెట్స్ ఉండగా ఆరవ ప్లేస్ లో అర్జున్ అంబటి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత టాప్ 5 లో ప్రియాంక, శివాజి, అమర్ దీప్, యావర్, పల్లవి ప్రశాంత్ ఉన్నారు. ఐదో పొజిషన్ లో ప్రియాంక ఎలిమినేట్ అయ్యింది. ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్ లో యావర్ హోస్ట్ నాగార్జున ఇచ్చిన ప్రైజ్ మనీ ని తీసుకుని ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.

ఇక థర్డ్ పొజిషన్ లో శివాజి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుండగా పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఈ ఇద్దరిలో పల్లవి ప్రశాంత్ ని విజేతగా ప్రకటించినట్టు తెలుస్తుంది. కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ టాస్కుల్లో తన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని మెప్పించాడు. హౌస్ లో కొందరు అతన్ని టార్గెట్ చేయగా శివాజి సపోర్ట్ గా నిలిచాడు. ఏడు సీజన్లలో ఒక కామన్ మ్యాన్ గా వచ్చి టైటిల్ గెలవడం ఇది తొలిసారి. రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు. సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ కోసం సూపర్ స్టార్ మహేష్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయినట్టు తెలుస్తుంది.