Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ ఫైనల్ గొడవ.. వాళ్లకు నోటీసులు..!

పరిస్థితి ముందు ఊహించే పోలీసులు పల్లవి ప్రశాంత్ ని ఎలాంటి ర్యాలీలు లేకుండా వెళ్లాలని చెప్పినా వినకుండా ఉత్సాహపడ్డాడు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 11:46 AM GMT
బిగ్ బాస్ ఫైనల్ గొడవ.. వాళ్లకు నోటీసులు..!
X

ఆరు సీజన్లు జరిగినా సరే బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ నాడు జరిగిన రచ్చ ఏనాడు జరగలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ నాడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పబ్లిక్, ప్రైవేట్ వహనాలపై దాడి తెలిసిందే. పరిస్థితి ముందు ఊహించే పోలీసులు పల్లవి ప్రశాంత్ ని ఎలాంటి ర్యాలీలు లేకుండా వెళ్లాలని చెప్పినా వినకుండా ఉత్సాహపడ్డాడు. అందుకే అతన్ని 3 రోజులు జైలులో ఉంచారు. అయితే విచారణ అనంతరం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు.

పల్లవి ప్రశాంత్ అయితే రిలీజ్ అయ్యాడు కానీ ఆరోజు గొడవలకు కారణమైన కొందరు ఆకతాయిలను మాత్రం పోలీసులు కస్టడీలోనే ఉంచుకున్నారు. ఈ వ్యవహారంలో పల్లవి ప్రశాంత్ తప్పు లేదనే పోలీసులు, కోర్ట్ నమ్ముతుంది. ఇదిలా ఉంటే ఈ గొడవ వల్ల బిగ్ బాస్ షో నిర్వాహకులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ డే నాడు జరిగిన గొడవపై బిగ్ బాస్ టీం ని వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గర అభిమానులు భారీగా వచ్చారన్న విషయాన్ని తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని బిగ్ బాస్ షో నిర్వాహకులైన ఎండెమోల్ షైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ గొడవపై వారి నుంచి కూడా పూర్తి వివరణ కోరుతున్నారు పోలీసులు.

షో పూర్తైన తర్వాత ఎలాంటి పబ్లిక్ ప్రాపర్టీస్ ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత షో నిర్వాహకుల మీద ఉంది. కానీ బిగ్ బాస్ టీం ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఒకవేళ వారు ముందుగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదని పోలీసుల వాదన. మొత్తానికి సీజన్ 7 గొడవ వల్ల బిగ్ బాస్ షో నిర్వాహకులకు కూడా పోలీసుల నుంచి షాక్ తగిలిందని చెప్పొచ్చు.

ఇక సీజన్ 7 ఫైనల్ నాడు జరిగిన ఈ గొడవలపై కొందరు నేతలు, ప్రముఖులు తమ స్పందన తెలియచేశారు. బిగ్ బాస్ షో మీద దాదాపు వారంతా దుమ్మెత్తిపోశారు. ఇంత హడావుడి జరుగుతున్నా కూడా బిగ్ బాస్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సీజన్ 7 గొడవలపై హోస్ట్ నాగార్జున సైలెంట్ గా ఉండటం కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.