Begin typing your search above and press return to search.

భజే వాయు వేగం టీజర్.. ఫాదర్ సెంటిమెంట్ గట్టిగానే..

త్వరలోనే ఈ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రశాంత్ రెడ్డి.. ఈ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

By:  Tupaki Desk   |   20 April 2024 9:52 AM GMT
భజే వాయు వేగం టీజర్.. ఫాదర్ సెంటిమెంట్ గట్టిగానే..
X

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుని రానిస్తున్నారు. ఆ మధ్య వరుస పరాజయాలు ఎదురవ్వడంతో కొత్త సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు భజే వాయు వేగం సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రశాంత్ రెడ్డి.. ఈ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ వీడియో మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. స్పీడుగా వెళ్తున్న కారు, డిక్కీలో డ‌బ్బుల మూట‌లతో ఫుల్ యాక్ష‌న్ ప్యాక్‌ డ్‌ గా సాగుతూ ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంది. అదే జోష్ తో తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ప్రస్తుతం భజే వాయు వేగం టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే చిరంజీవికి తాను వీరాభిమాని అని చాలా సందర్భాల్లో కార్తికేయ చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చానని కూడా తెలిపారు. ఇప్పుడు తన కొత్త సినిమా టీజర్ ను చిరంజీవి లాంఛ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న హీరో లైఫ్ స్టోరీనే భజే వాయు వేగం సినిమా కథగా టీజర్ ద్వారా తెలుస్తోంది. ఓ వైపు డ్రగ్స్.. మరో వైపు తండ్రీకొడుకుల ఎమోషన్స్ చుట్టూ ఈ మూవీ తిరుగుతుందనే విషయం అర్థమవుతోంది.

ఈ సినిమా టీజర్ లో ఒకే ఒక్క డైలాగ్ తో అదరగొట్టారు కార్తికేయ. "ప్రతి ఒక్కరి జీవితంలో ఒకడుంటాడు. వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడం. అది నా లైఫ్ లో మా నాన్న" అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఎమోషనల్ గా ఉంది. సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లు హైలెట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. టీజర్ సింపుల్ గా బాగుంది. మూవీపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. కార్తికేయ నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్నారు.

"ప్రతీ ఒక్కరి లైఫ్ లో కొందరుంటారు, వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాం... నా లైఫ్ లో అది మీరే" అంటూ ట్వీట్ చేశారు కార్తికేయ. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవి శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను రతన్ అందిస్తున్నారు. 2024లో విడుదల కానున్న ఈ సినిమా.. కార్తికేయకు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.