ముగ్గురు యంగ్ హీరోల బ్రదర్ హుడ్.. 'భైరవం' ఢం ఢమారే..
ప్రస్తుతం ఢం ఢమారే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాస్ బీట్స్ తో ఉన్న పాట.. అందరినీ ఆకట్టుకుంటోంది.
By: Tupaki Desk | 11 May 2025 6:46 AMటాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్.. కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీ భైరవం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
దివ్వ పిళ్లై, అదితి శంకర్, ఆనంది హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప్రియమణి, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముగ్గురు హీరోలు నటిస్తుండడంతో మూవీ ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే మూవీ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఆ జోష్ తో మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ గా అనౌన్స్ చేసినట్లు ఆదివారం ఉదయం మూడో సింగిల్ ను రిలీజ్ చేశారు. అన్నదమ్ములు పండుగలా వస్తారంటూ డం డమారే సాంగ్ ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.
ప్రస్తుతం ఢం ఢమారే సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాస్ బీట్స్ తో ఉన్న పాట.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఆలయంలో జరిగిన ఓ వేడుక సమయంలో మూవీలో ఢం ఢమారే సాంగ్ ఉండనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. మనోజ్, రోహిత్, సాయి శ్రీనివాస్.. ముగ్గురూ తమ మాస్ స్టెప్పులతో అలరించారు.
అయితే ఢం ఢమారే సాంగ్ కు భాస్కర భట్ల లిరిక్స్ అందించగా.. శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేశారు. ప్రముఖ సింగర్స్ రేవంత్, సాహితి, సౌజన్య ఆలపించారు.. సింపుల్ గా గాత్రంతో ప్రాణం పోశారని చెప్పాలి. మ్యూజిక్, లిరిక్స్, సింగింగ్.. అన్నీ బాగున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సాంగ్ అదిరిపోయిందని చెబుతున్నారు..
అదే సమయంలో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయని అంటున్నారు. అయితే మే 30వ తేదీన సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ రీసెంట్ గా ప్రకటించారు. సమ్మర్ కానుకగా థియేటర్స్ తో తీసుకువస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మరి భైరవం మూవీతో నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.