Begin typing your search above and press return to search.

బాలయ్య ఫ్యాన్స్​కు బ్యాడ్​ న్యూస్​..

అయితే ఇప్పుడా చిత్రం విడుదల కావట్లేదని తెలిసింది. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బాలయ్య అభిమానులకు నిరాశ ఎదురైంది.

By:  Tupaki Desk   |   30 Aug 2023 5:45 AM GMT
బాలయ్య ఫ్యాన్స్​కు బ్యాడ్​ న్యూస్​..
X

ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో నందమూరి బాలకృష్ణ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఆయన గతంలో నటించిన సూపర్ క్లాసిట్​ హిట్ సినిమా భైరవద్వీం ఆగస్ట్​ 30న రిలీజ్ అవ్వాల్సిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా చిత్రం విడుదల కావట్లేదని తెలిసింది. దీంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బాలయ్య అభిమానులకు నిరాశ ఎదురైంది.

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలయ్య నటించిన ఈ జానపద చిత్రంలో రోజా హీరోయిన్​గా నటించింది. ఈ చిత్రానికి మాధవ పెద్ది సురేష్‌ సంగీతం అందించారు. 1994లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా .. 9 నంది పురస్కారాల్ని గెలుచుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది.

అయితే ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్​లో భాగంగా.. ఈ భైరవద్వీపం సినిమాకు ఆధునిక హంగులు అద్ది 4కె రిజుల్యూషన్‌తో నేడు (ఆగస్టు 30)న రీ రిలీజ్‌ చేసేందుకు రెడీ అయ్యారు అభిమానులు, మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ క్లాప్స్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ బ్యానర్​ స్పెషల్ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు బాగా ఎదురుచూశారు.

అయితే ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్​ వల్ల రీరిలీజ్​ను ఆపేసినట్లు తెలిసింది. దాన్ని రీషెడ్యూల్​ చేసి నవంబర్ నెలకు విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే బాలకృష్ణ నటించిన పలు సినిమాలు రీ రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. 'చెన్న కేశవరెడ్డి', 'నరసింహనాయుడు' విడుదలై ఫ్యాన్స్​ను అలరించాయి.

ఇకపోతే బాలయ్య ప్రస్తుతం హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్‌ కేసరి' అనే మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేస్తున్నారు. ఇందులో హీరోయిన్​గా కాజల్ అగర్వాల్ నటించగా.. మరో కీలక పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. శరత్​ కుమార్​ మరో ప్రధాన పాత్రలో నటించారు.