Begin typing your search above and press return to search.

గ్రౌండ్ ఫ్లోర్​ బలిసిందా బే.. బాలయ్య మాస్​ వార్నింగ్​

ఈ క్రమంలోనే తాజాగా అభిమానుల కోసం ఓ సర్​ప్రైజ్ ఇచ్చింది. మూవీ షూటింగ్​ కంప్లీట్ అయినట్లు తెలుపుతూ ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్ చేసింది. 'ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి' పేరుతో.

By:  Tupaki Desk   |   28 Sep 2023 12:35 PM GMT
గ్రౌండ్ ఫ్లోర్​ బలిసిందా బే..  బాలయ్య మాస్​ వార్నింగ్​
X

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. యంగ్​ సెన్సేషనల్​ బ్యూటీ శ్రీలీల ప్రధాన పాత్రలో నటిస్తోంది. డైరెక్టర్​ అనిల్ రావిపుడి ఈ చిత్రాన్ని.. యాక్షన్ థ్రిల్లర్ అండ్​ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా రూపొందిస్తున్నారు. అయితే ఈ చిత్ర విడుదల తేదీ దగ్గరపడడంతో సినిమాపై మరింత హైప్ పెంచేలా ప్రమోషన్స్​ చేసుకుంటూ వస్తోంది భగవంత్ కేసరి టీమ్​.

ఈ క్రమంలోనే తాజాగా అభిమానుల కోసం ఓ సర్​ప్రైజ్ ఇచ్చింది. మూవీ షూటింగ్​ కంప్లీట్ అయినట్లు తెలుపుతూ ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్ చేసింది. 'ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి' పేరుతో.. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు సెట్​లో జరిగిన మేకింగ్ వీడియోను పంచుకుంది.

హై ఎనర్జీతో థ్లిల్లింగ్ షూటింగ్ పూర్తైనట్లు క్యాప్షన్ రాసుకొచ్చింది. 8 నెలలు పాటు 24 అద్భుత లొకేషన్స్​లో 12 భారీ సెట్స్ వేసి మూవీ షూటింగ్​ జరిపినట్లు పేర్కొంది. శ్రీలీల, కాజల్​, అర్జున్ రాంపాల్​, బాలయ్యపై అనిల్ రావిపూడి చిత్రీకరించిన సీన్స్​ను, ఇతర మూవీటీమ్​ సినిమా కోసం ఎంతలా కష్టపడిందో ప్రతీది చూపించారు. యాక్షన్​ సన్నివేశాల మేకింగ్​ను కూడా చూపించారు. ఇక ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరె లెవెల్​లో ఉంది. వీడియో చివర్లో 'కలిసి మాట్లాడుతా అన్న కదా... అంతలోనే మందిని పంపాలా... గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే' అంటూ బాలయ్య డైలాగ్ చెప్పడం హైలెట్ గా నిలిచింది.

'అఖండ', 'వీర సింహారెడ్డి' వంటి బ్యాక్​ టు బ్యాక్​ భారీ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి రానున్న సినిమా కావడంతో.. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో బాలయ్య హ్యాట్రిక్ పక్కా కొడతారని ఫ్యాన్స్​ ఆశిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన విడుదలైన టీజర్​, సాంగ్​తో పాటు ఇతర ప్రచార చిత్రాలు.. ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్​లు బాగా నచ్చాయి.

కాగా, ఈ చిత్రంలో శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటించగా.. బాలీవుడ్ నటుడు​ అర్జున్ రాంపాల్​ ప్రతినాయకుడిగా కనిపించారు. దసరా కానుకగా అక్టోబర్​ 19న సినిమా థియేటర్లలో విడుదల​ కానుంది. విజయ్​ దళపతి ఈగల్​, మాస్​ మహారాజా టైగర్ నాగేశ్వరరావుతో పోటీపడనుంది. ఇక ఈ చిత్రానికి తమన్‌- సంగీతం అందించారు. సి.రామ్‌ ప్రసాద్‌ - ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకున్నారు. షైన్ స్క్రీన్స్​ బ్యానర్​పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు.