Begin typing your search above and press return to search.

బెల్లంకొండ కూడా దెయ్యం వెంట పడ్డాడు

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తాజాగా కొత్త సినిమాని ఎనౌన్స్ చేశాడు. కౌశిక్ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా తెరకెక్కనుంది. కంప్లీట్

By:  Tupaki Desk   |   18 April 2024 5:05 AM GMT
బెల్లంకొండ కూడా దెయ్యం వెంట పడ్డాడు
X

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్, హర్రర్, క్రైమ్ జోనర్స్ ట్రెండ్ నడుస్తోంది. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ ఈ జోనర్ లో కథలని ట్రై చేస్తున్నారు. కొంతమంది అయితే బిగ్ హిట్స్ అందుకుంటున్నారు. నిఖిల్ సిద్ధార్ధ్ ఎక్కడికిపోతావు చిన్నవాడా అంటూ హర్రర్ జోనర్ లో మూవీ చేసి హిట్ కొట్టాడు. అలాగే సాయి తేజ్ థ్రిల్లర్ జోనర్ లో విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర ఫాంటసీ థ్రిల్లర్ జోనర్ లో చేస్తున్నాడు.

విశ్వక్ సేన్ కూడా థ్రిల్లర్ జోనర్ లో మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి హర్రర్ థ్రిల్లర్ జోనర్ లోకి మరో యంగ్ హీరో వస్తున్నాడు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తాజాగా కొత్త సినిమాని ఎనౌన్స్ చేశాడు. కౌశిక్ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమా తెరకెక్కనుంది. కంప్లీట్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమా ఎనౌన్స్ చేశారు.

చీకటి, వెలుగల మధ్య జరిగే యుద్ధంగా ఈ కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. పోస్టర్ బట్టి కంటెంట్ కొత్తగానే ఉండబోతోందని స్పష్టం అవుతోంది. ఇప్పటివరకు కమర్షియల్, యాక్షన్ సినిమాలతో సత్తా చాటిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సారి మాత్రం అవుట్ ఆఫ్ ది బౌండరీ కథతో ఈ కొత్త చిత్రం చేస్తున్నాడని తెలుస్తోంది. తేజ్ విరూపాక్ష తరహాలో ఇది కూడా పీరియాడిక్ హర్రర్ థ్రిల్లర్ గా ఉంటుందేమో అనేది చూడాలి.

లీక్స్ ప్రకారం అయితే బెల్లంకొండ హీరో దెయ్యంపై రివేంజ్ తీర్చుకునే కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందని సమాచారం. సినిమాలో దెయ్యాలు ఆత్మలు అంటూ పర్ఫెక్ర్ హారర్ ఎలిమెంట్స్ గట్టిగానే ఉండబోతున్నట్ల తెలుస్తోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు అనే మూవీ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది, యాక్షన్ కామెడీ జోనర్ లో ఈ సినిమా ఉండబోతోందని గతంలో వచ్చిన గ్లింప్స్ బట్టి తెలుస్తోంది. హిందీలో చేసిన ఛత్రపతి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బ్యాక్ తూ బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టాడు. టైసన్ నాయుడు షూటింగ్ దశలో ఉండగానే ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ జోనర్ మూవీని ఎనౌన్స్ చేశాడు. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మరి ఈ జోనర్ మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ కి ఎలాంటి హిట్ ఇస్తుందనేది చూడాలి.